జగన్ ను కలుసుకున్న బెంగాల్ ఐఎఎస్ అధికారి, అమరావతిలో చర్చ

 వైసీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత  వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ని పశ్చిమ బెంగాల్ కుచెందిన ఐ ఎఎస్ అధికారి డా. గోదాల కిరణ్ కుమార్ కలుసుకున్నారు.  ఆదివారం  విజయనగరం జిల్లా నవిరి నుంచి గరుగుబిల్లి మండలానికి ప్రజా సంకల్పయాత్రకు జగన్ బయలుదేరుతున్న సమయంలో పశ్చిమ బెంగాల్‌ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి జి.కిరణ్‌కుమార్‌ ఆయనను కలిశారు. 2005 బ్యాచ్‌కు చెందిన కిరణ్‌కుమార్‌ జగన్‌ను కలిసిన తదుపరి సంకల్ప యాత్రలో కూడా పాల్గొన్నారు. సర్వీసులో ఉన్న ఒక ఐఎస్ అధికారి ఇలా జగన్ ను కలుసుకోవడం రాష్టంలోని ఐఎఎస్ అధికారులలో పెద్ద చర్చనీయాంశమయింది. దానికితోడు కిరణ్ కుమార్ మీద గతంలో  చాలా చేసులు ఉండటం, ఆయన చాలా వివాదస్పదుడు కావడం కూడా ఈ చర్చకు తోడయింది.

కిరణ్ కుమార్ సమావేశం గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో సమావేశమయినపుడు ఫిర్యాదు చేసే అవకాశం ఉందని తెలిసింది.

డాక్టర్ గోదాల కిరణ్ కుమార్ ను  2015 లో పశ్చిమబెంగాల్ సిఐడి పోలీసులు అరెస్టు చేశారు. సిలిగురి, జల్పాయ్ గురి డెవెలప్ మెంట్ అధారిటీ (ఎస్ జె డి ఎ) కు సిఐవొ గా ఉన్నపుడు ఆయన నిధులను దుర్వినియోగం చేశారన్న ది ఆరోపణ. దీని మీద విచారణ అనంతరం అక్కడి సిఐడి ఆయనను అరెస్టు చేసింది. ఈ స్కాం విలువ రు. 100 కోట్ల విలువయినది మీడియా రాసింది.

అంతేకాదు, 2013 లో కూడా ఆయనొకసారి అరెస్టయ్యారు. అపుడాయన బెయిలు మీద వచ్చారు.

ఎస్ జె డి ఎ లో పనిచేస్తున్నపుడు ఆయన దాదాపు అరుకోట్ల లంచం తీసుకున్నారని ఈ డబ్బును హవాల రూట్లో ఆంధ్రప్రదేశ్ లో  ఉన్న భార్యకు పంపించారని సిఐడి  సమర్పించిన  చార్జ్ షీట్ లో పేర్కొన్నారు. ఈ చార్జ్ షీట్ లో భార్య  మారుతండ్రి (ఇ గుర్రప్పనాయుడు), సోదరుడి(అంగాలకుర్తి ఉదయ్ చైతన్య) పే ర్లను కూడా  ప్రస్తావించారు. ఆయనను మరొక ఆరు కేసులలో కూాడా అరెస్టు చేసినట్లు చెబుతున్నారు.

ప్రస్తుతం ఆయన దక్షిణ బెంగాల్ ట్రాన్ పోర్ట్ కార్పొరేషన్ లో పనిచేస్తున్నారు.