అఖిలప్రియ పెళ్ళికి హాజరు కాబోయే ముఖ్య అతిధులు వీరే…

ఆంధ్రా మంత్రి అఖిల ప్రియ పెళ్లి పనులు జోరుగా సాగుతున్నాయి. పారిశ్రామికవేత్త భార్గవ్ రామ్ నాయుడుతో ఆమె పెళ్లి ఈ నెల 29 న జరగనుంది. ఆళ్లగడ్డలోని కోటకందుకూరు మెట్టలో భూమా శోభానాగిరెడ్డి మెమోరియల్ ఇంజనీరింగ్ కాలేజ్ వీరి పెళ్లి వేడుకకు వేదిక అయింది. వీరి పెళ్ళికి తెలుగు రాష్ట్రాల నుండి పలువురు ప్రముఖులు హాజరు కానున్నారు.

పెళ్ళికి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం కెసిఆర్, ఉభయ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్, మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగరరావు, మంత్రి లోకేష్, ఇరు తెలుగు రాష్ట్రాల మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్రస్థాయి అధికారులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కలిపి 50 వేల మంది వరకు హాజరు కావచ్చని ఎమ్మెల్యేలు ఎస్వీ, భూమా బ్రహ్మానందరెడ్డి వెల్లడించారు.

కల్యాణమండపంలో 5000 మంది వీఐపీలు కూర్చోవడానికి వీలుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. మంత్రి అఖిలప్రియ పెళ్లి ఏర్పాట్లను దగ్గరుండి చూసుకుంటున్నారు కర్నూల్ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి, నంద్యాల ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి, మార్కెట్ యార్డు చైర్మన్ బీవీరామిరెడ్డి.