విశాఖ ఎయిర్పోర్టులో జగన్ పై జరిగిన దాడి ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతోంది. నవ్వుతూ సెల్ఫీ దిగుతానంటూ వచ్చి నమ్మకంగా కత్తితో పొడిచాడు ఎయిర్పోర్టు వెయిటర్ శ్రీనివాస్. జడ్ కేటగిరి రక్షణ ఉండాల్సిన ప్రతిపక్ష నేతకు కల్పించే భద్రత ఇదేనా అంటూ వైసీపీ అభిమానులు ఆగ్రహిస్తున్నారు. తమ అభిమాన నేతపై ఇలాంటి దాడి జరగడాన్ని తీవ్రంగా మండి పడుతున్నాయి వైసీపీ వర్గాలు. కాగా ఈ ఘటనపై వైసీపీ నేత విజయసాయిరెడ్డి స్పందించారు. ఆయన తన ట్విట్టర్ అకౌంట్ లో ఒక పోస్టు పెట్టారు.
“శ్రీ జగన్ గారి భద్రత, రక్షణ చర్యలు మరింత పటిష్టం చేయాలని గతంలో చేసిన అనేక విజ్ఞప్తులను ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. చివరకు ఆయన ప్రయాణించే వాహనాలు సైతం తరచూ మరమ్మత్తులకు గురవుతూ మొరాయిస్తున్నా తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించడం వెనుక ప్రభుత్వం ఉద్దేశం ఇదేనా?” అంటూ ఆయన ట్విట్టర్ లో పోస్ట్ చేసారు. ఆయన ట్వీట్ కింద ఉంది చూడండి.
శ్రీ జగన్ గారి భద్రత, రక్షణ చర్యలను మరింత పటిష్టం చేయాలని గతంలో చేసిన అనేక విజ్ఞప్తులను ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. చివరకు ఆయన ప్రయాణించే వాహనాలు సైతం తరచుగా మరమ్మతులకు గురవుతూ మొరాయిస్తున్నా ప్రభుత్వం తీవ్రనిర్లక్ష్యం ప్రదర్శించడం వెనుక ప్రభుత్వం ఉద్దేశం ఇదేనా?
— Vijayasai Reddy V (@VSReddy_MP) October 25, 2018