ప్రూఫ్స్ తో పోలీస్ స్టేషన్ లో దిగాడు : తన మీద ఎవరు ఎలా దాడి చేశారో మొత్తం చెప్పుకొచ్చిన విజయ్ సాయి రెడ్డి

Vijayasai Reddy Files Complaint On Ramatheertham Issue

ఆంధ్రప్రదేశ్ లో దేవాలయాల మీద జరుగుతున్న దాడులు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో రామతీర్థం శ్రీరాముడి ఆల‌యంలో జరిగిన దుశ్చర్య ఇప్పుడు పెద్ద ఉద్రిక్త పరిస్థితులకి దారి తీసింది. రాష్ట్రం మొత్తం నుండి ఈ వ్యవహారం మీద తీవ్ర విమర్శలు వస్తున్న వేళ ఆ దేవాల‌య‌ సంద‌ర్శ‌న‌కు వెళ్లిన వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి మీద దాడి జరగటం, తర్వాత త‌న‌పై టీడీపీ కార్యకర్తలు రాళ్లు, వాటర్‌ ప్యాకెట్లతో తనపై దాడి చేశారని విజ‌య‌సాయిరెడ్డి ఆరోపిస్తూ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. దీంతో నెల్లిమర్ల పోలీసులు కేసు నమోదు చేశారు. టీడీపీ అధినేత‌ చంద్రబాబుతో పాటు ఆ పార్టీ నేత‌లు అచ్చెన్నాయుడు, కళా వెంకట్రావుల ఆదేశాల ప్ర‌కార‌మే ఈ దాడి జ‌రిగింద‌ని చెప్పుకొచ్చారు. ఆ దాడిలో తన గన్‌మన్‌కు గాయాలయ్యాయని, పోలీసులకు ఫిర్యాదు చేశామ‌ని తెలిపారు.

Vijayasai Reddy Files Complaint On Ramatheertham Issue
Vijayasai Reddy Files Complaint On Ramatheertham Issue

విజయ సాయి రెడ్డిగారు దీనిపై ట్విట్ట‌ర్ ద్వారా కూడా స్పందిస్తూ ప‌రోక్షంగా చంద్ర‌బాబుపై విమ‌ర్శ‌లు గుప్పించారు. ఆయ‌న‌ అనుకూల మీడియా యజమానులను కలిసేందుకు వెళ్తే మాత్రం బూట్లు విప్పి వంగి వంగి వినయం ప్రదర్శిస్తార‌ని చెప్పారు. పూజల్లో, ఆలయ ప్రాంగణాల్లో మాత్రం పాదరక్షలను విడవకుండా ఆయన పాల్గొంటారని అన్నారు. అలాంటి మనిషి ఇప్పుడు భక్తి, మత విశ్వాసాల గురించి చెబుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉందని ఆయన చంద్ర బాబుని విమర్శించారు.