జీహెచ్ ఎంసీ మేయర్ ఇంట్లో విషాదం

జీహెచ్ ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ ఇంట్లో విషాదం నెలకొంది. మేయర్ సోదరి సునీత శుక్రవారం కన్నుమూశారు. సునీత గత కొంత కాలంగా గుండె సమస్యతో బాధపడుతున్నారు. శుక్రవారం గుండెపోటు రావడంతో ఆమె కన్నుమూశారు.

సునీత మృతదేహం వద్ద నివాళి అర్పిస్తున్న కడియం, విషాదంలో మేయర్

సునీత స్వస్థలం వరంగల్ రూరల్ జిల్లా రాయపర్తి మండలంలోని మొరిపిరాల గ్రామం. సోదరి మృతి వార్త తెలుసుకున్న మేయర్ వెంటనే మొరిపిరాలకు చేరుకున్నారు. తన సోదరి మృతదేహాన్ని చూసి ఆయన కంట తడి పెట్టారు.

సునీత మృతి వార్త తెలుసుకున్న టిఆర్ ఎస్ నేతలు కడియం శ్రీహరి, ఎర్రబెల్లి దయాకర్ రావు సహా కార్యకర్తలు, నేతలు సునీత నివాసానికి చేరుకొని నివాళులర్పించారు. శనివారం మధ్యాహ్నం సునీత అంత్యక్రియలు జరగనున్నాయి.