వరంగల్ జిల్లాలో వీఆర్వో నిర్బంధం, టెన్షన్ (వీడియోలు)

వరంగల్ రూరల్ జిల్లా దామెర మండలం ఊరుగొండ మండల వీఆర్వోను గ్రామస్థులు పంచాయతీ కార్యాలయంలో నిర్బందించారు. గ్రామ వీఆర్వో శ్రీనివాస్ పట్టాల కోసం రైతుల వద్ద అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నాడని వారు ఆరోపించారు. అక్రమంగా వ్యాపారులకు భూములు రిజిస్ట్రేషన్లు చేస్తున్నారని వారు విమర్శించారు.

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పట్టాదారు పాస్ బుక్ లలో కూడా వీఆర్వో లంచాలు తీసుకున్నారని గ్రామస్థులు ఆరోపించారు. గ్రామస్థులు ఆగ్రహంతో వీఆర్వోను పంచాయతీ కార్యాలయంలో నిర్భందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకొని వీఆర్వోను విడిపించారు. గ్రామస్థులు వీఆర్వోను బంధించిన వీడియోలు కింద ఉన్నాయి చూడండి.