Telangana High Court: అగ్రిగోల్డ్‌, అక్షయగోల్డ్‌ కేసులపై తెలంగాణ హైకోర్టు కీలక నిర్ణయం

హైదరాబాద్‌: అగ్రిగోల్డ్‌, అక్షయగోల్డ్‌ కేసులను ఏలూరులోని జిల్లా కోర్టుకు బదిలీ చేస్తూ తెలంగాణ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. వాటి అస్తుల వేలం ద్వారా వచ్చే రూ.50 కోట్ల డబ్బును కూడా ఏలూరు కోర్టుకు బదలాయించాలని రిజిస్ట్రీని ఆదేశించింది. దాదాపు ఏడేళ్లుగా అగ్రిగోల్డ్‌, అక్షయగోల్డ్‌ కేసులను తెలంగాణ హైకోర్టు విచారణ జరుపుతోంది. తాజా ఆ కేసుకు ఏలూరు కోర్టుకు ట్రాన్స్‌ఫర్ చేసింది. ఇక గతంలో ఇచ్చిన ఆదేశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని తెలంగాణ హైకోర్టు ఏలూరు న్యాయస్థానాన్ని ఆదేశించింది. దీంతో ఈ రెండు సంస్థ సంబంధించిన కేసులన్నింటిపై ఇక ఏలూరు కోర్టు విచారణను జరుపుతుంది.