చక్రం కాదు, ఢిల్లీలో బొంగరం కూడా తిప్పలేరు: కెసిఆర్ మీద చురకలు

జాతీయ పార్టీ పెట్టి ఢిల్లీలో చక్రం తిప్పుతానని చెబుతున్న తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు మీద రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు  డాక్టర్ లక్ష్మణ్ పదునైన మాటల ఈటెలు విసిరారు.  

నిన్న కేసీఆర్ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ, బిజెపి కేంద్ర నాయకుల మీద చేసిన వ్యాఖ్యాలు నవ్వు తెప్పిస్తున్నాయని అన్నారు. ఈ రోజు కెసిఆర్ వ్యాఖ్యలకు స్పందిస్తూ కేటీఆర్ ,కేసీఆర్ వ్యాఖ్యలు అహంకారానికి నిదర్శనం, ఏదో చెప్తూఏదో చేస్తూ  నీతులు వల్లిస్తున్నారని అన్నారు.

రంగులు మార్చే ఊసరవెల్లి లాగా ఇష్టం వచ్చినట్లు వారు మాట్లాడుతున్నారు.ప్రగతిభవన్ కు పరిమితం అయిన మీరు ప్రధాని పై అభ్యంతకరంగా మాట్లాడుతున్నారు.

లక్ష్మణ్ వేసిన చురకలు…

మీరు ఎందులో నంబర్ వన్ అనేది చెప్పాలి అని లక్ష్మణ్ ప్రశ్నించారు. రెండు లక్షల కోట్ల అప్పులు చేయడం లోనా…పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడంలోనా… మీరు నంబర్ వన్ ఎందులోనో చెప్పాలి

ఆరు సంవత్సరాలుగా సీఎం గా ఉంటూ ఒక్క సారి కూడా సెక్రటేరియట్ కు రాలేదు. ఇందులో నెంబర్ వన్నా?

పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహిస్తే  చీరి   చింతకు కడతాం అన్నారు, గుర్తుందా. మీరు ఇప్పుడు చేస్తున్నదేమిటి? సంతలో పశువుల్లాగా ఎమ్మెల్యే లను కొంటున్నారు.మిమ్మల్ని ఎవరు చీరి చింతకు కట్టాలి.

మీరు ఢిల్లీ లో చక్రం కాదు కదా బొంగరం కూడా తిప్పలేరు.

తెలంగాణ తరహా దేశాన్ని తీర్చుదిద్దుతాం అంటున్న మీరు ఏ విధంగా చేస్తారో సమాధానం చెప్పాలి…

అన్ని అధికారాలు రాష్ట్రాలకు ఇవ్వాలని చెప్తున్న మీరు ఢిల్లీ వెళ్లి ఏం చేస్తారు.

యజ్ఞాలు చేసినంత మాత్రాన హిందువు కావు.

అయోధ్య రామ మందిరం పై మీ పార్టీ వైఖరి చెప్పలేకపోతున్నారు

కేసీఆర్ ది.., టీఆర్ఎస్ ది ద్వంద వైఖరి, ద్వంద నీతి

మజ్లీస్ పార్టీ ముష్టి పార్టీ అన్న మీకు అదే పార్టీ ఎలా ముద్దయిందో చెప్పాలి….