విజయ్ సాయి చేసిన పని ఇప్పుడు బిజెపిలో చేరిన టిడిపి నాయకులు చేస్తారట!

YSRCP MP Vijay Sai Reddy

విజయ్ సాయి చేసిన పని ఇప్పుడు బిజెపిలో చేరిన టిడిపి నాయకులు చేస్తారట!

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ  2014లో కచ్చితంగా అధికారంలోకి వస్తామని ఊహించింది. కానీ అనూహ్యంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో విజయం సాధించింది. అలాగే తెలుగుదేశం మిత్రపక్షమైన బిజెపి  కేంద్రంలో సంపూర్ణ మెజారిటీ సాధించింది. అంతేకాకుండా తెలుగుదేశం ప్రభుత్వం కేంద్రంలో  బిజెపి ప్రభుత్వంతో అధికారాన్ని పంచుకుంది.

మోడీ హవా దేశంలో వెలిగి పోతున్న సమయంలో తెలుగు దేశాన్ని ఢీ కొట్టాలంటే ఈ రెండు పార్టీలని విడదీయకుండా సాధ్యపడదని జగన్ గుర్తించారు. అప్పటి నుండి క్రమంగా దీక్షలు నిరసనలు ప్రజా పోరాటాలు రాష్ట్రంలో ఒకవైపు చేస్తూనే తన అంతరంగికుడైన విజయసాయిరెడ్డిని రాజ్య సభకు పంపించి ప్రత్యేక హోదా అనే అంశం పదే పదే ప్రస్తావిస్తూ తెలుగుదేశం పార్టీ మీద అ ఒత్తిడి పెంచారు. ఒత్తిడి ఎంతలా తెలుగుదేశాన్ని ప్రభావితం చేసిందంటే కేంద్ర ప్రభుత్వం నుంచి ఎన్డీఏ నుంచి బయటకు రావాల్సిన  పరిస్థితి.

ఎప్పుడైతే తెలుగుదేశం బిజెపి విడిపోయారు తెలుగు దేశాన్ని ఓడించడం జగన్ కి సులభం అయిపోయింది. అదే వ్యూహాన్ని ఇప్పుడు తెలుగుదేశం అమలు పరుస్తుంది. అయితే అది బిజెపి పక్షాన చేరి. కీలకమైనా తెలుగుదేశం నాయకులు  బిజెపిలో చేరి వైయస్సార్ కాంగ్రెస్ బిజెపి మధ్య కొనసాగుతున్న సత్సంబంధాలని దెబ్బతీయాలనేది వ్యూహం అట. కేంద్ర సహకారం లేనిదే అప్పుల ఊబిలో ఉన్న ఆంధ్రప్రదేశ్లో లో అభివృద్ధి సంక్షేమం అమలుపరచడం జగన్ కి తలకు మించిన భారం అవుతుందనేది తెలుగుదేశం ఆలోచన.