టిడిపి టార్గెట్ అదేనా ?

తెలుగుదేశంపార్టీ ఏ విషయంపైనైనా టార్టెట్ పెడితే చాలా జాగ్రత్తగా పావులు కదుపుతుంది. ఇపుడు కూడా అలాగే వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. చంద్రబాబునాయుడు తాజా టార్గెట్ ఏమిటంటే జగన్మోహన్ రెడ్డిని వీలైనంతలో గబ్బు పట్టించటం. మొన్నటి ఎన్నికల్లో వైసిపిని చిత్తుగా ఓడించాలని చంద్రబాబు అనుకున్నారు. కానీ జనాలు టిడిపినే ఘోరంగా ఓడించారు.

ఎన్నికల్లో ఎదురైన ఘోర ఓటమిని చంద్రబాబు అండ్ కో, ఎల్లో మీడియా తట్టుకోలేకపోతోంది. అందుకనే జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా పాలనా అనుభవం లేదు కాబట్టే తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారంటూ పెద్ద ఎత్తున విషప్రచారానికి తెరలేపారు. ఏపి ప్రజలను దెబ్బకొట్టేలా తెలంగాణా ప్రయోజనాలకు సహకరిస్తున్నారంటూ సెంటిమెంటును ప్రయోగిస్తున్నారు.

విషయం ఏదైనా సరే జగన్ ను గబ్బు పట్టించటమనే టార్గెట్ ను తన ఎల్లో మీడియా ద్వారా శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నారు. కాకపోతే చంద్రబాబు మరచిపోయిన విషయం ఒకటుంది. ఎన్నికలు జరిగి ఇప్పటికి కేవలం రెండు నెలలు కూడా కాలేదు. ఇప్పటి నుండే సెంటిమెంటును ప్లే చేయాలన్నా, జగన్ ప్రభుత్వాన్ని ప్రయత్నాలు చేయాలన్నా ఉపయోగం ఉండదు.

చంద్రబాబు ఐదేళ్ళ పాలనలో చేసిన అవినీతి, నిర్వాకాలను జనాలు జీర్ణించుకోలేక, ఏహ్యభావంతోనే టిడిపిని చావు దెబ్బకొట్టారు. ఒకవేళ జగన్ కూడా అదే దారిలో ప్రయాణిస్తే ఎన్నికల్లో జనాలే బుద్ధి చెబుతారు. చంద్రబాబు అనుకుంటే జగన్ దిగిపోరు. జనాలు అనుకుంటేనే జగన్ ఓడిపోతారన్న విషయాన్ని కూడా గ్రహించకుండా కేవలం జగన్ ను టార్గెట్ చేయాలని ప్రయత్నిస్తున్నారంటే….