తెలుగుదేశం నాయకులు ఏం చేసినా తప్పించుకోలేరు !

తెలుగుదేశం నాయకులు ఏం చేసినా తప్పించుకోలేరు

వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో తెలుగుదేశం పార్టీ మీద ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఆయన కుమారుడు లోకేష్ బాబు మీద తీవ్ర విమర్శలు చేయాలంటే ముందు వరుసలో ఉంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ రాజ్యసభ సభ్యులు ఆ పార్టీ పార్లమెంటరీ నాయకులు వి విజయసాయి రెడ్డి

ఒకవైపు ట్వీట్లతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపై విరుచుకు పడుతున్న లోకేష్ బాబు మీద ఎవరు అదే స్థాయిలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి సరైన రీతిలో కౌంటర్ ఇవ్వడం లేదు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు మనోగతం.

అయితే దీనికి ఫుల్ స్టాప్ పెడుతూ విజయసాయిరెడ్డి తనదైన శైలిలో తెలుగుదేశం నాయకులకు తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. దాని సారాంశం ఏంటంటే జ్యుడీషియల్ కమిషన్, రివర్స్ టెండరింగ్, విద్యుత్పి పిఏలపై సమీక్ష వంటి నిర్ణయాలతో చంద్రబాబు మరియు ఆయన కోటరీకి వెన్నులో వణుకు మొదలైంది. అందుచేత తెలుగుదేశం పార్టీ వారు వారికి వారే ఎక్కడ తెలుగుదేశం హయాంలో ఒక్క రూపాయి కూడా అవినీతి జరగలేదని సర్టిఫికెట్లు ఇచ్చుకుంటున్నారట.

అలాగే మరికొంత మంది తెలుగుదేశం నాయకులు పార్టీ మారి బిజెపిలో చేరి ఎస్కేప్ రూట్ ఎంచుకుంటున్నారట. ఏమి చేసినా కానీ తెలుగుదేశం నాయకులు తప్పించుకోలేరు అని విజయసాయి రెడ్డి చెప్పారు .