నాదగ్గర ఆధారాలున్నాయి.. మంత్రి రాజీనామా చేయాల్సిందే.. టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు

tdp leader ayyanna patrudu press meet on benz car issue

టీడీపీకి వైసీపీ మీద ఆరోపణ చేయడానికి బ్రహ్మాండమైన అస్త్రం ఒకటి దొరికింది. ఇక ఊరుకుంటారా? వైసీపీని దెబ్బ తీయడమే ఇక. ఇప్పటికే టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు.. మంత్రి జయరాంపై ఈఎస్ఐ కుంభకోణానికి సంబంధించి ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈఎస్ఐ కుంభకోణానికి సంబంధించిన నిందితుడు మంత్రి జయరాం కొడుకు ఈశ్వర్ కు బెంజికారు లంచంగా ఇచ్చాడంటూ అయ్యన్నపాత్రుడు ఆరోపిస్తున్నారు.

tdp leader ayyanna patrudu press meet on benz car issue
tdp leader ayyanna patrudu press meet on benz car issue

ఆ కారు ఖచ్చితంగా లంచంగా ఇచ్చిందేనని.. దానికి సంబంధించిన అన్ని ఆధారాలు తన వద్ద ఉన్నాయని ఆయన తెలిపారు. దానికి సంబంధించిన మరిన్ని ఆధారాలను ఆయన బయటపెట్టారు.

జులై 26 నుంచి ఈశ్వర్ ఆ బెంజ్ కారులోనే తిరుగుతున్నట్టు దానికి సంబంధించిన వీడియో ఫుటేజ్ ను అయ్యన్న విడుదల చేశారు. బెంజ్ కారు ఫోటోలను కూడా ఈశ్వర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడంటూ అయ్యన్నపాత్రుడు ఆరోపించారు.

నా వద్ద చాలా ఆధారాలు ఉన్నాయి. కానీ.. అవసరం ఉన్నప్పుడు మిగితా ఆధారాలు బయటపెడతాడు. ఈఎస్ఐ కుంభకోణానికి సంబంధించి బెంజ్ కారును లంచంగా తీసుకోవడం ముమ్మాటికి నిజం. ఇప్పటికైనా మంత్రి జయరాం..తను చేసిన తప్పును ఒప్పుకొని రాజీనామా చేయాలి. మంత్రి జయరాం సంగతి సీఎం జగన్ కు తెలుసు. అయినా కూడా ఆయన్ను జగన్ కాపాడుకుంటూ వస్తున్నారు.. అని అయ్యన్న తెలిపారు.

ఫోటోలతో సహా ఆధారాలన్నీ నేను మీడియా ముందు చూపిస్తుంటే.. ప్రభుత్వం ఎందుకు మంత్రిపై విచారణకు ఆదేశించడం లేదు. ఇప్పటికైనా సీఎం ఈ ఘటనపై స్పందిస్తారని ఆశిస్తున్నా. మాజీ మంత్రిని అయిన నేనే ఏసీబీకి ఫిర్యాదు చేస్తే పట్టించుకునే నాథుడే లేడు. ఇక.. సామాన్య ప్రజల పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.. అంటూ అయ్యన్న పాత్రుడు వ్యాఖ్యానించారు.