తిరుపతి టిడిపి ఎంపీ అభ్యర్ధిని ప్రకటించిన చంద్రబాబు

తిరుపతి టిడిపి ఎంపీ అభ్యర్ధిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మీ పేరును సీఎం చంద్రబాబు ప్రకటించారు. సోమవారం నెల్లూరులో  జరిగిన సభలో పనబాక లక్ష్మీ దంపతులు టిడిపిలో చేరారు. అనంతరం ఆమె పేరును చంద్రబాబు ప్రకటించారు. 

11,12,14 వ లోక్ సభకు నెల్లూరు నుంచి, 15 వ లోక్ సభకు బాపట్ల నుంచి పనబాక లక్ష్మీ ఎంపీగా గెలుపొందారు. 2004 నుంచి 2009 వరకు ఆరోగ్య కుబుంబ శాఖ మంత్రిగా 2009 నుంచి 2014 వరకు పెట్రోలియం, టెక్స్ టైల్స్  మంత్రిగా పని చేశారు. పనబాక లక్ష్మీ అత్యధిక మెజార్టీతో గెలుస్తారని చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు.