ఆశ్చర్యకరం.! సునీతా రెడ్డిపై విమలా రెడ్డి విమర్శలు.!

అంతా వైఎస్ కుటుంబంలోనే జరుగుతోంది.! ఔను, వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు వైఎస్ వివేకానంద రెడ్డి దారుణ హత్యకు గురైతే, ఆ హత్య వెనుక కుట్ర వైఎస్ అవినాశ్ రెడ్డి అంటున్నారు వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీతా రెడ్డి.!

సునీతా రెడ్డి అలాగే ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి.. ఆస్తి కోసమే వైఎస్ వివేకానంద రెడ్డిని చంపించేశాన్నది అవినాశ్ రెడ్డి అండ్ టీమ్ ఆరోపణ. వైఎస్ వివేకానంద రెడ్డి మతం మార్చుకుని, ఓ ముస్లిం మహిళను పెళ్ళాడరనీ అవినాశ్ రెడ్డి ఆరోపిస్తున్నారు.

వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించి, సీబీఐ తీవ్రమైన అభియోగాలు అవినాశ్ రెడ్డి మీద మోపుతోంది. విచారణకు హాజరు కాకుండా వైఎస్ అవినాశ్ రెడ్డి కర్నూలు ఆసుపత్రిలో వుండి హైడ్రామా నడిపిస్తున్నారు.. తన తల్లికి అనారోగ్యమంటూ.!

తాజాగా, సీన్‌లోకి వచ్చారు వైఎస్ విమలా రెడ్డి. ఈమె స్వయానా వివేకానంద రెడ్డికి సోదరి. సాధారణంగా విమలా రెడ్డి రాజకీయాల్లో కనిపించరు. అవినాశ్ రెడ్డి తల్లిని పరామర్శించేందకు కర్నూలు ఆసుపత్రికి వచ్చారామె. నిన్ననే విజయమ్మ కూడా అవినాశ్ రెడ్డి తల్లిని పరామర్శించిన సంగతి తెలిసిందే.

విజయమ్మ ఎక్కడా ఎలాంటి రాజకీయ పరమైన వ్యాఖ్యలూ చేయలేదు. కానీ, విమలా రెడ్డి మాత్రం, సునీతా రెడ్డిపై ఆరోపణలు చేశారు. వైఎస్ వివేకా హత్య విషయంలో సునీత మాట మార్చారన్నది విమలారెడ్డి ఆరోపణ. అవినాశ్ నిర్దోషి అని చెబుతున్నారామె. విమలా రెడ్డి ఎంట్రీ వల్ల ఈ కేసులో వైసీపీకి ఏంటి లాభం.? అవినాశ్ రెడ్డికి ఏంటి ఉపశమనం.?