ఆలేరు టిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్ధి గొంగిడి సునీత ప్రచారంలో ప్రమాదం జరిగింది. నాంచారి పేట గ్రామంలో సునీత ప్రచారం చేస్తుండగా కార్యకర్తలు బాంబులు పేల్చారు. దీంతో ప్రమాదవశాత్తు 8 మంది గ్రామస్తులకు గాయాలయ్యాయి. వీరిలో చిన్నారులు కూడా ఉన్నట్టు తెలుస్తోంది.
ప్రమాదం జరగగానే వీరిని ఆసుపత్రికి తరలించారు. అయితే సునీత కనీసం పరామర్శకు కూడా పోకపోవడాన్ని తప్పు పడుతూ బాధిత కుటుంబాలు నిలదీశాయి. గొంగిడి సునీతా మహేందర్ రెడ్డిని నిలదీసిన వీడియో కింద ఉంది చూడండి.