వైసిపిలో స్టార్స్ క్యాంపెయినింగ్

పోలింగ్ తేదీ దగ్గరకు వచ్చేకొద్దీ  వైసిపిలో ప్రచారం ఊపందుకుంటోంది. ఇప్పటి వరకూ అభ్యర్ధుల తరపున ప్రచారం మొత్తాన్ని అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమే మోస్తున్నారు. ఇకనుండి స్టార్ల క్యాంపెయిన్ కూడా మొదలవ్వబోతోందట. తాజాగా పార్టీలో చేరిన మోహన్ బాబు రెండు మూడు రోజుల్లో ప్రచార బాధ్యతలు అందుకోనున్నట్లు సమాచారం.

అదేవిధంగా ఇప్పటికే పార్టీలో చేరిన ప్రముఖనటులు ఆలీ, పృధ్విరాజ్, పోసాని కృష్ణమురళి, భానుచందర్, విజయ్ చందర్ లాంటి వాళ్ళు కూడా ప్రచారంలోకి దూకనున్నారు. ఆలీ, పోసాని ఆధ్వర్యంలో ప్రచారంలో రెండు బృందాలు రంగంలోకి దూకబోతున్నాయి.

వీరితో సంబంధం లేకుండానే మోహన్ బాబు ప్రత్యేకంగా టూర్ ప్లాన్ చేస్తున్నట్లు పార్టీ వర్గాలు చెప్పాయి. వీళ్ళకి అదనంగా జగన్ తల్లి విజయమ్మ, సోదరి వైఎస్ షర్మిల కూడా ప్రచారం మొదలుపెట్టబోతున్నారు. అంటే ఒకేసారి వైసిపి తరపున ప్రచారాన్ని మొదలుపెట్టి ఉధృతంగా జనాల్లోకి వెళ్ళాలన్నది జగన్ ఆలోచనగా తెలుస్తోంది. జగన్ ఒక్కడు ప్రచారం చేస్తేనే చంద్రబాబునాయుడుకి పిచ్చెక్కినట్లవుతోంది. ఒకేసారి అన్నీ వైపుల నుండి చంద్రబాబును ప్రచారంలో చుట్టిముడితే ఏమైపోతాడో పాపం.