పవన్ కళ్యాణ్, మురళీ మోహన్ పై రెచ్చిపోయిన శ్రీరెడ్డి(వీడియో)

నటి శ్రీరెడ్డి మరోసారి పవన్ కళ్యాణ్ పై విరుచుకు పడ్డారు. ఇద్దరు మహిళల్ని నడి రోడ్డుపైన వదిలేసాడు పవన్ కళ్యాణ్. బీజేపీ సపోర్ట్ తో కాస్టింగ్ కౌచ్ ఉద్యమానికి ఆటంకాలు కలిగించాడు. కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చిన ఒత్తిడి వలనే మీడియా నా ఇంటర్వ్యూలు తీసుకోవటం మానేశారు. నేను పొలిటికల్ ఎంట్రీ ఇస్తే పవన్ కళ్యాణ్ కి ఆపోజిట్ గా నిలబడతాను. ఖచ్చితంగా గెలుస్తాను ఎందుకంటే ఆయనకి 2 లేదా మూడు సీట్లు కంటే గెలవడు. పవన్ కళ్యాణ్ కి ఓట్లు వేయకండి అని తన అభిమానులకి పిలుపినిచ్చింది.

పవన్ కళ్యాణ్ పై తనదైన శైలితో బూతులతో విరుచుకుపడింది శ్రీరెడ్డి. ఒక్క పవన్ కళ్యాణ్ గురించే కాదు తన కుటుంబంపై కూడా విరుచుకుపడింది. నాకు ఎన్నికల సమయంలో పిలుపు వస్తే వైఎస్సార్ గారి ఉప్పు తిన్నాను కాబట్టి వైసీపీ కి, లేదా టీడీపీ కి సపోర్ట్ చేస్తాను అని చెప్పింది. టీడీపీ అంటే తనకి ప్రాణం అని చెప్పిన శ్రీరెడ్డి మురళీ మోహన్ టీడీపీలో కలుపు మొక్క అని అభివర్ణించింది.

ఆయనకి అధికార దాహం తీరక కోడల్ని కూడా రాజకీయాల్లోకి దిమ్పాలని చూస్తున్నాడు అనింది. సొంత నియోజక వర్గంలోనే మురళీ మోహన్ ఓడిపోతాడు అని పేర్కొంది. మా అసోసియేషన్ గురించి డిస్కస్ చేయకుండా ఇప్పుడు నా గురించి ఆయన మాట్లాడాల్సిన పని ఏంటని ప్రశ్నించారు. మహా న్యూస్ మూర్తి గురించి కూడా ఆవిడ పలు విషయాలు వెల్లడించారు.

పవన్ కళ్యాణ్, మురళీ మోహన్, చిరంజీవి, మహా న్యూస్ మూర్తి, టీడీపీ, జగన్ గురించి శ్రీరెడ్డి ఎన్నో విషయాలు మాట్లాడింది. తన పొలిటికల్ ఎంట్రీ గురించి కూడా కొన్ని విషయాలు తెలిపింది. ఆ సంగతులేమిటో తెలియాలంటే కింద ఉన్న వీడియో పైన క్లిక్ చేయండి.