ఆంధ్ర ప్రదేశ్:రాష్ట్ర బీజేపీ పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రభుత్వా అధికారులపైనా వైసీపీ నాయకులపైన ఆగ్రహం వ్యక్తం చేశారు.బీజేపీ కార్యకర్తల సమావేశంలో సోము వీర్రాజు మాట్లాడుతూ…ఆ నాడు చంద్రబాబు నాయుడునే లెక్క చెయ్యలేదు,నేడు జగన్ ను కూడా లెక్క చేసేది లేదు అన్నారు. వైసీపీ ఎంఎల్ఏ లను మిమ్ములను కూడా హెచ్చరిస్తున్న బీజేపీ కార్యకర్తల విషయంలో జాగ్రత్తగా మసులుకోవాలి అన్నారు.ప్రభుత్వ అధికారులను కూడా ఈ సందర్భంగా హెచ్చరించారు.ఏ ప్రభుత్వం అయిన అయిదు ఏండ్లు మాత్రమే అధికారంలో ఉంటుంది.అధికారులు మాత్రం 40 ఏండ్లు పదవిలో ఉంటారు.రాజకీయ పార్టీల చేతిలో కీలు బొమ్మలుగా మారోద్దు అన్నారు.
గతంలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు పసుపు కుంకుమ ఇస్తే 23 సీట్లు మాత్రమే ఇచ్చారు.పార్టీలు శాశ్వతం కావు.మేము కూడా అధికరంలోకి వస్తే అప్పుడు పరిస్థితులు వేరేలాగా ఉంటాయి అని హెచ్చరించారు.నెల్లూరులోని సర్వేపల్లిలో మకాం వేస్తాం నేను అంటే ఏమిటో చూపిస్తా మాతో జాగ్రత్తగా ఉండండి అంటూ తీవ్ర హెచ్చరికలు జారీ చేశాడు.ఏపీలో బీజేపీ ని అధికారంలోకి తీసుకురావడానికి పార్టీ అధ్యక్షుడు రాజకీయ ప్రణాళికలను రచిస్తున్నాడు.ఎలాగైనా ఏపీలో పుంజుకోవలని వీలు చిక్కినప్పుడల్ల అధికార ప్రతిపక్ష పార్టీలపైన విమర్శలు చేస్తున్నే ఉన్నాడు.