సంచలనం: వివేకా మరణంపై అనుమానాలు..శరీరంపై గాయాలు ?

మాజీ మంత్రి, దివంగత సిఎం వైఎస్సార్ సోదరుడు వైఎస్ వివేకానందరెడ్డి మృతిపై సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈరోజు ఉదయం గుండెపోటుతో మరణించాడని అందరూ అనుకున్నారు. అయితే, ఆయన శరీరంపై గాయాలున్నాయంటూ వివేకా పిఎం కృష్ణారెడ్డి పులివెందుల పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేయటం సంచలనంగా మారింది. బాత్ రూంలో వివేకా రక్తపుమడుగులో పడి ఉండటమే తన అనుమానానికి కారణంగా పిఏ ఫిర్యాదులో పేర్కొన్నారు. ముక్కు, చేతులుపై బలమైన గాయాలున్నట్లు పిఏ చెబుతున్నారు. పిఏ చేసిన ఫిర్యాదుతో పోలీసులు కూడా వివేకాది అనుమానాస్పద మృతిగా నమోదు చేసుకుని దర్యాప్తు మొదలుపెట్టారు. గుండెపోటుతో వివేకా మరణిస్తే తల, చేతులపై బలమైన గాయాలు ఎందుకయ్యాయనేది ప్రశ్న. మొత్తానికి గుండెపోటుతో మృతి చెందారని అనుకున్న వివేకానందరెడ్డి మరణం చివరకు అనుమానాస్పదంగా మారటం సంచలనంగా మారింది.