సాక్ష్యాలతో సహా పవన్ పై ఫైర్ అయిన సాదినేని యామిని

టిడిపి ఏపీ అధికార ప్రతినిధి సాదినేని యామిని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఫైర్ అయ్యారు. శ్రీకాకుళం పర్యటనలో ఉన్న పవన్ శ్రీకాకుళం తుఫానుపై తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా చంద్రబాబునాయుడుపై విమర్శల దాడి మొదలెట్టారు. ఈ విమర్శలపై స్పందిస్తూ సాదినేని యామినేని తన ఫేస్బుక్ అకౌంట్ లో ఆధారాలతో సహా ఒక పోస్ట్ పెట్టారు. ఇప్పుడు ఆమె పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ ఐంది. ఆ పోస్ట్ కింద ఉంది చూడండి.

ఇప్పటివరకు #కరెంటు ఎందుకు ఇవ్వలేదంటూ #పవన్ #దిగజారుడుట్వీట్… దానికి ఆధారాలతో సహా #సమాధానం ఇదే…

#శ్రీకాకుళం తుఫాను పై రాజకీయ దాడి మొదలైంది. తుఫాను కొట్టిన నాలుగు గంటల్లోనే చంద్రబాబు తన క్యాబినెట్ మొత్తానికి పలాసకు మార్చి, అక్కడ నుంచే పరిపాల చేస్తున్నారు. ఇప్పటికి 7 #రోజులు అయ్యింది. చంద్రబాబు అంతకు ముందు రోజు నుంచే, #తుఫాను ప్రభావం అంచనా వేస్తూ, తగు ఆదేశాలు ఇస్తూ, తుఫాను వచ్చే ముందు రోజు రాత్రి #నిద్రకూడా పోకుండా, అప్రమత్తంగా ఉన్నారు. అప్పటి నుంచి ఇప్పటి దాక, #శ్రీకాకుళంలోనే పని చేస్తూ, పరిస్థితులు చక్కదిద్దుతున్నారు. #ప్రభుత్వమేఇంత ఇదిగా పని చేస్తే, ఇక #ప్రతిపక్షం ఇరగబడి పని చెయ్యాలి. కాని మన #ఖర్మకు ఒక నాయకుడు #హైదరాబాద్ పోయాడు, ఇంకో వాడు స్పెషల్ #ఫ్లైట్ లలో తిరుగుతూ, #కారులో కవాతులు చేసుకుంటూ, తీరిగ్గా #ఆరురోజుల తరువాత వచ్చాడు.

#సరే వచ్చాడు. ఆయనకు చేతనైన సహాయం చెయ్యాలి, లేకపోతే లోపాలు ఉంటే ప్రభుత్వానికి నివేదించాలి. ఎక్కడ ప్రజలకు ఇబ్బంది ఉందో చెప్పాలి. నిన్న ఒక రెండు గంటలు తిరిగాడు, #పేపర్ లో ఎదో రాసుకుని, ఈ రోజు మరో రెండు గంటలు తిరిగాడు. ఇక #ట్విట్టర్ వేదికగా రాజకీయ దాడి మొదలు పెట్టాడు. ముందుగా #తెలుగుదేశం పార్టీని నేనే గెలిపించా అని #ట్వీట్ మొదలు పెట్టి, మీ అంతు చూస్తా అని అన్నాడు. తరువాత #కరెంటు విషయంలో, ఇప్పటికి ఆరు రోజులు అయ్యింది, కరెంటు ఎందుకు రాలేదు అంటూ చంద్రబాబుని ప్రశ్నిస్తూ ట్వీట్ చేసాడు పవన్. నిజానికి, #పవన్ కళ్యాణ్ ఇక్కడ అవమానించేది #చంద్రబాబుని కాదు, గ్రౌండ్ లో పని చేసే కొన్ని వేల మంది స్టాఫ్ ని.. పవన్ చౌకబారు ఆరోపణకు, #ఆధారాలతో సహా #సమాధానం ఇది.

#ఇరవై-ముఫై సంవత్సరాల నుండి వేసుకున్న #విద్యుత్ వ్యవస్థ మొత్తం #తిత్లీ దెబ్బకు కకావికలం అయిపోయింది. 30 వేల కరెంటు స్థంబాలు పడిపోయాయి. మీరోచ్చి ఆరు రోజులైనా పునరుద్ధరించలేదని ఆరోపణలు చేస్తున్నారు. 7 #వేల మంది సిబ్బంది #రాత్రనకా, #పగలనకా, #దసరా లాంటి పెద్ద పండగలను, #పెళ్ళాంబిడ్డలనొదిలేసి కష్టపడి పనిచేస్తున్నారు. మీరు తీరిగ్గా కవాతులు, బలప్రదర్శనలు పూర్తి చేసుకోని వచ్చి ఒకపూట, ఒక #మూల తిరిగి నోటికొచ్చినట్లుగా #మాట్లాడతారా ? ఇంటికి కరెంట్ రావాలంటే ముందు 33కేవీ లైన్లు, తవాత 11కేవీ లైన్లు సరిచెయ్యలి. ట్రాన్స్ఫార్మర్ పోల్స్ కూడా పడిపోయే. అవి నిలబెట్టాలి. అప్పుడు LT లైన్లు సరి అవుతాయి. అవి అన్నీ సరి చెయ్యాలంటే ఏదో ఒకటి రెండు రోజుల్లో మీరు సినిమాలో వేసిన సెట్ లా అయిపోదు. ఇప్పటికి దాదపుగా 85 శాతం కరెంటు ఇస్తున్నారు. మిగిలిన చోట్ల పనులు జరుగుతున్నాయి. అవి కూడా మరో, నాలుగు అయిదు రోజులలో పూర్తవుతాయి. మీ #రాజకీయ ప్రచారం కోసం, కష్టపడి పని చేసే వారిని, తక్కువ చేసి మాట్లాడకండి. చేతనైతే సహాయం చెయ్యండి. లేకపోతే కవాతులు చేసుకోండి..