మహానాడు 2025 వేదికగా తెలుగుదేశం పార్టీకి ఆదరణ వెల్లువెత్తింది. ఈ సందర్భంగా పార్టీకి భారీగా విరాళాలు అందాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకారం, ఇప్పటివరకు రూ.22.53 కోట్లు విరాళాలుగా అందాయని వెల్లడించారు. పార్టీకి దాతలుగా నిలిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మంచి పనులకిచ్చిన విరాళానికి దేవుడు మరింత ధన సంపదను ప్రసాదిస్తాడని వ్యాఖ్యానించారు.
విరాళాలు అందించిన దాతలలో అత్యధికంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి: రూ. 5 కోట్లు ఇచ్చారు..
మిగతా వారి లిస్టు ఈ విధంగా ఉంది.
ఎం. రాజశేఖర్: రూ. 1 లక్ష
జి. కోటేశ్వరరావు: రూ. 1 లక్ష 116
యనమల దివ్య: రూ. 1 లక్ష
గద్దె పద్మావతి: రూ. 2 లక్షలు
గద్దె అనురాధ: రూ. 2 లక్షలు
గద్దె రామ్మోహన్ రావు: రూ. 2 లక్షలు
గోవర్ధన్ రెడ్డి: రూ. 5 లక్షలు
కంది చంద్రశేఖర్ రావు: రూ. 5 లక్షల 116
బాజీ చౌదరి: రూ. 5 లక్షలు
బొజ్జల సుధీర్ రెడ్డి: రూ. 10 లక్షలు
ఆలపాటి రాజేంద్ర ప్రసాద్: రూ. 10 లక్షలు
డేగల ప్రభాకర్ రావు: రూ. 10 లక్షలు
గోవిందరావు: రూ. 10 లక్షలు
వేగేశ నరేంద్రవర్మ: రూ. 10 లక్షలు
దినేష్ రెడ్డి పోలంరెడ్డి: రూ. 10 లక్షలు
పులివర్తి నాని: రూ. 10 లక్షల 116
అరిసిమిల్లి రాధాకృష్ణ: రూ. 13 లక్షలు
ఆదిరెడ్డి శ్రీనివాస్: రూ. 15 లక్షలు
నాగవంశీ (సితార ఎంటర్టైన్మెంట్స్): రూ. 25 లక్షలు
జీవీ ఆంజనేయులు: రూ. 25 లక్షలు
ప్రత్తిపాటి పుల్లారావు: రూ. 25 లక్షలు
శ్రీనివాస్ చిన్ని: రూ. 25 లక్షలు
వేమన సతీష్: రూ. 25 లక్షలు
దామచర్ల జనార్దన్: రూ. 25 లక్షలు
కొండపల్లి శ్రీనివాస్: రూ. 40 లక్షలు
గంగా ప్రసాద్: రూ. 50 లక్షలు
లక్ష్మీ వెంకటేశ్వర మెటల్ ఇండస్ట్రీస్: రూ. 50 లక్షలు
ఎస్ఆర్సీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (రాజగోపాల్): రూ. 50 లక్షలు
సానా సతీష్: రూ. 1 కోటి 16 లక్షలు
కొల్లు రవీంద్ర: రూ. 1 కోటి
పార్థసారథి: రూ. 1 కోటి
ఆనం రామనారాయణ రెడ్డి: రూ. 1 కోటి
బీసీ జనార్ధన్ రెడ్డి: రూ. 1 కోటి
పయ్యావుల కేశవ్: రూ. 1 కోటి
భాష్యం రామకృష్ణ: రూ. 1 కోటి
గొట్టిపాటి రవికుమార్: రూ. 1 కోటి
టీజీ భరత్: రూ. 1 కోటి
పి. నారాయణ: రూ. 1 కోటి
మాగుంట శ్రీనివాసులు రెడ్డి: రూ. 1.5 కోట్లు
వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి: రూ. 5 కోట్లు
ఈ విరాళాల వివరాలను చంద్రబాబు పారదర్శకంగా ప్రకటించడం అభినందనీయం. ప్రతి కార్యకర్త, అభిమాని పార్టీ అభివృద్ధిలో భాగస్వామిగా మారాలన్నందుకు ఆయన పిలుపునిచ్చారు.