తార్నాకలో రోడ్డు ప్రమాదం… తండ్రి, కొడుకుల మృతి

హైదరాబాద్ తార్నాకలో మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తండ్రి, కొడుకులు అక్కడికక్కడే మృతి చెందారు. తార్నాకలోని డిగ్రి కాలేజ్ ఎదురుగా బైక్ పై వెళ్తున్న తండ్రి కొడుకులు రోడ్డు మల్లుతున్నారు. ఇంతలో వారిని స్పీడ్ గా వచ్చిన ట్యాంకర్ లారీ వెనుక నుంచి ఢికొట్టింది. దీంతో వారిద్దరు రక్తపు మడుగులో పడి అక్కడికక్కడే చనిపోయారు.

కొడుకు నవీన్, తండ్రి సోమరాజు చనిపోవడంతో వారి కుటుంబంలో విషాద చాయలు అలుముకున్నాయి. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.