కర్నూల్ జిల్లాలో రైతులను పరామర్శించిన హీరోయిన్ రేణూ దేశాయ్

రేణుదేశాయ్ కూర్చోవ‌డానికి ఇబ్బంది ప‌డిన‌ వేళ‌

రైతుల సమస్యల పై అధ్యయనం కోసం సినీ నటి రేణూ దేశాయ్ సోమవారం కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్నారు. ఆదివారం రాత్రే ఆమె మంత్రాలయం చేరుకున్నారు. ఎస్ వీబీ గెస్ట్ హౌజ్ లో ఆమె బస చేశారు. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను ఆమె పరామర్శించనున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు, ప్రస్తుతం బాధితుల కుటుంబ పరిస్థితిని అడిగి తెలుసుకోనున్నారు.

ఆలూరు మండలం తుంబళబీడుకు చెందిన నెరణికి రామయ్య దంపతులు గతేడాది ఆగష్టులో, అదే ఏడాది డిసెంబర్ 25న పెద్దకడబూరుకు చెందిన పెద్దరంగన్న ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో రేణూ దేశాయ్ ఉదయం తుంబళబీడు, మధ్యాహ్నాం పెద్దకడబూరులో పర్యటించనున్నారు. తుంబళవీడులో రైతు కుటుంబాన్ని ఆమె పరామర్శించారు.

రైతుల సమస్యల పై ఇతి వృత్తంగా ఓ సినిమాను దర్శకత్వం వహించనున్నట్టు గతంలో రేణూ దేశాయ్ ప్రకటించారు. హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులను అలరించిన రేణూ తాజాగా దర్శకురాలిగా రీఎంట్రీ ఇవ్వబోతున్నారు. అందుకోసమే రేణూ దేశాయ్ స్వయంగా రైతులను కలిసి వారి సమస్యలను తెలుసుకోనున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్. ఇదే సమయంలో పవన్ విస్తృతంగా ఆంధ్రాలో పర్యటిస్తున్నారు. ఇద్దరు ఒకే సారి పర్యటిస్తుండడం చర్చనీయాంశమైంది.