ఘోర రోడ్డు ప్రమాదం.. వైసీపీ సీనియర్ నేత దుర్మరణం !

YSRCP

ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వైసీపీ కీలక నేతల్లో ఒకరైన నాయకుడు రావూరి అయ్యవరయ్య ప్రయాణిస్తున్న కారును లారీ బలంగా ఢీకొట్టింది.దీనితో రావూరి అయ్యవరయ్య అక్కడికక్కడే మరణించారు. ఈ సంఘటన ఒంగోల్ మండలంలోని చెరువుకొమ్ము పాలెం లో జరిగింది.

ycp tension in tirupati by election
ycp tension in tirupati by election

రోడ్డు ప్రమాదంలో టంగుటూరు వైసీపీ నాయకుడు రావూరి అయ్యవరాయ్య మరణించగా, మండల్ ఇన్‌ఛార్జి శ్రీహరి గాయపడ్డారు. రావూరి మరియు శ్రీహరి హైదరాబాద్ నుండి తమ గ్రామానికి తిరిగి వస్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఈ సంఘటన వెనుక లారీ డ్రైవర్ నిర్లక్ష్యం కారణమని చెబుతున్నారు.

ప్రస్తుతం పోస్ట్‌మార్టం నిమిత్తం రావూరి అయ్యవరాయ మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. వైసిపి నాయకులు రావూరికుటుంబానికి సంతాపం తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. రావూరి కొండపి నియోజకవర్గంలో పార్టీ సీనియర్ నేతగా ఉన్నారు.