భువనేశ్వరి వల్లే బాబుకు ఈ గతి… అత్తకోడళ్లు మామూలోల్లు కాదు!

స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్టైన చంద్రబాబు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. సుమారు మూడు వారాలుగా బాబు అక్కడే ఉంటున్నారు. మరోపక్క ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్ మెంట్ కేసులో ఈ నేల 4న లోకేష్.. సీఐడీ అధికారుల ముందు విచారణకు హాజరవుతున్నారు. అయితే ఈరోజు తండ్రీకొడుకులిద్దరూ ఇలా అయిపోవడానికి కారణం భువనేశ్వరి అంటూ పోసాని సంచలన వ్యాఖ్యలు చేశారు.

నేడు చంద్రబాబు నాశనం అయిపోడానికీ.. లోకేష్ ఇంత నాశనం కావడానికి నారా భువనేశ్వరే కారణం అని పోసాని సంచలన కామెంట్లు చేశారు. జైలులో చంద్రబాబుతో ములాకత్ అనంతరం బయటకు వచ్చిన భువనేశ్వరి… తన భర్తను అక్రమంగా అరెస్టు చేశారని, 371 కోట్లు అవినీతి చేయడానికి తమకేం కర్మ అని.. హెరిటేజ్ లో జస్ట్ రెండు శాతం అమ్ముకుంటే చాలు నాలుగు వందల కోట్లు వస్తాయని చెప్పుకొచ్చారని పోసాని తెలిపారు.

ఇప్పుడు తమకేం కర్మ అని అంటున్న భువనేశ్వరి… నాడు కాంగ్రెస్ పార్టీ చంద్రబాబుకు ఎమ్మెల్యే టిక్కెట్ ఇచ్చి, మంత్రి పదవి ఇచ్చిన తర్వాత… టీడీపీలోకి వెళ్లడానికి “మాకేం కర్మ” అని అనుకోలేదే అని పోసాని నిలదీశారు. అనంతరం ఎన్టీఆర్ ని అమాయకుడిని చేసి చంద్రబాబుని టీడీపీలో చేర్పించారని అన్నారు.

అనంతరం చంద్రబాబు కుర్చీ లాక్కున్నప్పుడు, ఎన్టీఆర్ ని వెన్నుపోటు పొడిచినప్పుడు, ఎన్టీఅర్ పై చెప్పులు వేయించినప్పుడు… “మాకేం కర్మ” అని ఎందుకు అనలేదని నిలదీశారు. ఇదంతా భువనేశ్వరికి తెలిసే జరిగిందని… లేకపోతే… నాడే చంద్రబాబుని నిలదీసేవారని అన్నారు. భువనేశ్వరికి తన భర్త సీఎం అయితే చాలు, తర్వాత తన కుమారుడు ముఖ్యమంత్రి అయితే చాలు.. మిగిలిన వాళ్లు ఏమైనాపోయినా పర్లేదు.. ఎన్టీఆర్ మరణించినా పర్లేదు అంటూ పోసాని ఫైరయ్యారు.

ఇందులో భాగంగా… ఒకరు చంద్రబాబు, లోకేష్ లను మించిన రాజకీయ నాయకురాలు భువనేశ్వరీ, బ్రాహ్మణి అని… అత్తా కోడళ్ళు ఇద్దరూ భర్తల కంటే పెద్ద రాజకీయ నాయకురాళ్లు అని పోసాని విమర్శించారు. పవన్ కళ్యాణ్ అమాయకుడు కాబట్టే మళ్ళీ టీడీపీకి మద్దతు ఇస్తున్నారని.. ఆ విధంగా అత్త కోడళ్లు ట్యూన్ చేశారని.. పవన్ కళ్యాణ్ ఎంత తిట్టినా వాళ్లు పొత్తు పెట్టుకుంది కేవలం కాపు ఓట్ల కోసమే అని పోసాని సంచలన వ్యాఖ్యలు చేశారు.