అలాంటి దుర్మార్గుడికి టీటీడీ పదవి ఎలా ఇస్తారు?

Police have arrested ttd board member Karan Reddy for that which he cheated on a woman

టీటీడీ హైదరాబాద్ సలహా మండలి వైస్ ప్రెసిడెంట్ గా ఉన్న కరణ్‌రెడ్డి చేసిన పాడు పని ఇప్పుడు సంచలంగా మారింది. ఈ వ్యవహారం మీద నారా లోకేష్ జగన్ ప్రభుత్వం మీద తీవ్ర స్థాయిలో మండి పడ్డారు. టీటీడీ పదవులలో ఇలాంటి కామాంధులని నియమిస్తారా అంటూ ఈ కరణ్‌రెడ్డికి తెలంగాణాలో ఒక పార్టీకి, ఆంధ్రప్రదేశ్ లో ఒక పార్టీకి సన్నిహితుడుగా పేరు ఉంది. ఈయన ఆయా పార్టీలకు చేసిన సేవకు మెచ్చి ఏకంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో పదవి కూడా ఇచ్చారు. అయితే సదరు వ్యక్తి పై ఇప్పుడు హైదరాబద్ లో నమోదు అయిన కేసు చూసి అందరూ అవాక్కయ్యారు. హైదరాబాద్ తార్నాక ప్రాంతానికి చెందిన ఒక యువతితో, ఆ వ్యక్తి సామాజిక మాధ్యమం ద్వారా పరిచయం పెంచుకుని తరువాత ఆమెను నమ్మించి, మోసం చేసారని, సదరు వ్యక్తితో పాటుగా అతని భార్యా పై కూడా, బాధిత మహిళ బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్లో కేసు నమోదు చేసింది. దీంతో పోలీసులు పలు సెక్షన్ ల కింద కిరణ్ రెడ్డి మీద కేసు నమోదు చేసి విచారణ అనంతరం ఆయన్ని అరెస్ట్ చేయటం జరిగింది.

Police have arrested ttd board member Karan Reddy for that which he cheated on a woman
Police have arrested ttd board member Karan Reddy for that which he cheated on a woman

అయితే అతని భార్య పైన కూడా కేసు పెట్టగా, ఆమె పరారీలో ఉందని తెలుస్తుంది. బాధిత యువతికి వైద్య పరీక్షలు కోసం హాస్పిటల్ కు తరలించారు. అరెస్ట్ చేసిన కరణ్‌రెడ్డిని పోలీసులు రిమాండ్ కు తరలించారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఇలాంటి వ్యక్తికీ తిరుమల లాంటి పవిత్రమైన చోట ఎలా చోటు ఇస్తారు అంటూ ప్రశ్నించారు. గతంలో కూడా టీటీడీలో ఉన్నత పదవిలో ఉన్న ఒక సినిమా యాక్టర్ కూడా ఇలానే దారుణమైన పనులు చేయటం చూసాం. టీటీడీ డిక్లరేషన్ ఇవ్వకుండా, భక్తుల పై లాఠీ చార్జ్ చేసి అడుగడుగునా తిరుమలను అపవిత్రం చేస్తున్నారని, ఆగ్రహం వ్యక్తం చేసారు. మహిళలను మోసం చేసే కామంధులకు, తిరుమల లాంటి చోట పదవి ఎలా కట్టబెడతారు అంటూ లోకేష్ ప్రశ్నించారు. తిరుమలలో ఇలాంటి దుర్మార్గపు అకృత్యాలు జరగటం మంచిది కాదని పలువురు విచారం వ్యక్తం చేస్తున్నారు. దేవుడు తప్పకుండా వారింమని శిక్షిస్తారని శపిస్తున్నారు.