Manne Ravindra: మేడే సందర్భంగా కార్మిక లోకానికి డాక్టర్ మన్నె రవీంద్ర శుభాకాంక్షలు

Manne Ravindra: ప్రపంచ నిర్మాణంలో కార్మికుల పాత్ర వెలకట్టలేనిదని, వారి కష్టార్జితంపైనే దేశ సౌభాగ్యం ఆధారపడి ఉందని ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ మన్నె రవీంద్ర గారు పేర్కొన్నారు. అంతర్జాతీయ కార్మిక దినోత్సవం (మేడే) సందర్భంగా రాష్ట్రంలోని కార్మికులకు, శ్రామికులకు ఆయన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.

కార్మికులే నిజమైన దేశ నిర్మాతలు: ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎండనక, వాననక అహర్నిశలు శ్రమించి సమాజానికి సేవ చేస్తున్న ప్రతి కార్మికుడికి శిరస్సు వంచి ప్రణామం చేస్తున్నట్లు తెలిపారు. “శ్రమయేవ జయతే” అన్న నినాదంతో ముందుకు సాగే శ్రామిక శక్తికి గౌరవం కల్పించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఆయన గుర్తు చేశారు.

కార్మిక సంక్షేమంలో టీడీపీ ముందంజ అని ఆయన అన్నారు, తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ కార్మికుల పక్షపాతి అని మన్నె రవీంద్ర స్పష్టం చేశారు. అసంఘటిత రంగ కార్మికులకు సామాజిక భద్రత కల్పించడంలో.. వారి పిల్లల చదువులకు, ఆరోగ్యానికి అండగా నిలవడంలో టీడీపీ హయాంలో అనేక విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నామని గుర్తు చేశారు.

కార్మికుల హక్కుల రక్షణ కోసం, వారి జీవన ప్రమాణాలు మెరుగుపరచడం కోసం పార్టీ నిరంతరం కృషి చేస్తూనే ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు.

శ్రమను గౌరవిద్దాం – ప్రగతిని సాధిద్దాం: అభివృద్ధి చెందిన ఆంధ్రప్రదేశ్ నిర్మాణంలో కార్మికుల చెమట చుక్క భాగస్వామ్యం ఎంతో ఉందని, భవిష్యత్తులో కూడా రాష్ట్ర అభివృద్ధిలో వారు కీలక పాత్ర పోషించాలని ఆయన ఆకాంక్షించారు. ప్రతి పనికి ఒక గౌరవం ఉందని, శ్రమను గౌరవించడం ద్వారానే సమాజం ఉన్నత స్థితికి చేరుకుంటుందని మన్నె రవీంద్ర గారు పిలుపునిచ్చారు.

BJP Master Plan With Jr.NTR?, Chandrababu Reaction | Telugu Rajyam