Chandrababu – Modi: ఈ విషయంలో చంద్రబాబే సరైన నాయకుడు.. మోదీ ఎలివేషన్స్!

అమరావతిలో శుక్రవారం పునర్‌ నిర్మాణ పనులకు నరేంద్ర మోదీ వర్చువల్‌గా శంకుస్థాపన చేయడం రాష్ట్రానికి విశిష్ట ఘట్టంగా నిలిచింది. అనంతరం జరిగిన సభలో ప్రధాని మోదీ చేసిన ప్రసంగం ప్రేక్షకులను ఆహ్లాద పరిచింది. విశేషంగా ఆయన ప్రసంగాన్ని తెలుగులో ప్రారంభించి ‘దుర్గమ్మ తల్లి పుణ్యభూమిలో’ అంటూ మాట్లాడటం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ వంటి నేతలకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు.

“ఇది కేవలం నగరం నిర్మాణం కాదని, కొత్త ఆంధ్రప్రదేశ్‌కు శక్తి కేంద్రం అవుతుందని” పేర్కొన్నారు. ఐటీ, గ్రీన్ ఎనర్జీ, విద్యా రంగాలు అమరావతిలో కొత్త దశకు దారి తీస్తాయని చెప్పారు. రూ.60 వేల కోట్లతో ప్రారంభించిన ప్రాజెక్టులు భవిష్యత్తు స్వర్ణాంధ్రానికి బలమైన బేస్ ఇస్తాయని స్పష్టం చేశారు. నాయుడుపేట-రేణిగుంట హైవే ప్రాజెక్ట్ లాంటి కనెక్టివిటీ కార్యక్రమాలూ రాష్ట్ర అభివృద్ధికి ఉదాహరణగా నిలుస్తాయని తెలిపారు.

ఈ సందర్భంగా చంద్రబాబుపై మోదీ చేసిన ప్రశంసలు మరింత విశేషంగా నిలిచాయి. “భారీ ప్రాజెక్టులు చేపట్టాలంటే, వేగంగా పూర్తిచేయాలంటే చంద్రబాబుగారే సరైన నాయకుడు. దేశంలో అలాంటి నేత ఇంకొక్కరు లేరు” అంటూ ప్రశంసల వర్షం కురిపించారు. గతంలో హైదరాబాద్ ఐటీ అభివృద్ధి తర్వాత, గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్కడి అధికారులను హైదరాబాద్‌కు పంపించి అధ్యయనం చేయించానని గుర్తుచేశారు. ఇదే కారణంగా చంద్రబాబుకు టెక్నాలజీపై అంతర్జాతీయ దృష్టి ఉందని వివరించారు.

పాత కాలంలో ఎన్టీఆర్ ఏపీ కోసం కలలు కన్నట్టు, ఈనాటి ప్రజలు కలలు నిజం చేయాల్సిన సమయం ఇదేనని మోదీ అన్నారు. వికసిత భారత్ దిశగా, ఏపీని ప్రధాన ఇంజిన్‌గా మార్చేందుకు కేంద్రం పూర్తిస్థాయిలో మద్దతుగా నిలబడుతుందని హామీ ఇచ్చారు. చంద్రబాబు పవన్ కల్యాణ్ నేతృత్వంలో రాష్ట్రం పునఃవైభవం పొందుతుందని ధైర్యం నూరిపోసేలా ప్రధాని సందేశం ముగిసింది.

అమరావతి కట్టేనా? || Cine Critic Dasari Vignan Reacts On PM Modi Relaunches Capital Amaravati || TR