Minister Perni Nani : బిగ్ న్యూస్ : నాని, సిద్ధార్థ్ లపై సంచలన కామెంట్స్ చేసిన పేర్ని నాని!

Minister Perni Nani : టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఇప్పుడు టికెట్ ధరల అంశం అలాగే మరోపక్క థియేటర్స్ మూసివేతకు సంబంధించి ఎలాంటి సంచలనాలు నెలకొంటున్నాయి చూస్తూనే ఉన్నాము. ఓ రకంగా టాలీవుడ్ హీరోలు మరియు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి నడుమ యుద్ధమే నడుస్తుంది అని చెప్పాలి. ఇక ఇదిలా ఉండగా గత కొన్ని రోజులు కితం నాచురల్ స్టార్ నాని చేసిన కామెంట్స్ కానీ ఆలాగే మరో హీరో సిద్ధార్థ్ చేసిన కామెంట్స్ కానీ ఏ రేంజ్ లో వేడి పుట్టించాయి అనేది అందరికీ తెలుసు.

సిద్ధార్థ్ అయితే జస్ట్ ట్వీట్స్ తోనే సంచనలనం రేపాడు. దీనితో ఏపీ ప్రభుత్వం నుంచి మంత్రి పేర్ని నాని, ఇద్దరు హీరోలు నానికి అలాగే సిద్ధార్థ్ సంచలన కౌంటర్లు ఇవ్వడం ఇపుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. జీవో 35 ని ఎప్పుడో ఏప్రిల్ లో ఇచ్చాము అని మరి ఈరోజు ఆ జీవో కి నిరసనగా మూసివేయడానికి నాని ఏ ఊరు లో ఉన్నారో? ఆయన ఏ కిరాణా కొట్టు లెక్కలు లెక్కపెట్టారో తెలియదు అంటూ నానికి కౌంటర్ ఇచ్చారు.

ఇక అలాగే సిద్ధార్థ్ పై మాట్లాడుతూ సిద్దార్థ్ ఎక్కడుంటారు..ఆయన చెన్నై లో స్టాలిన్ కోసం మాట్లాడారేమో, సిద్దార్థ్ ఏమైనా ఇక్కడ టాక్స్ లు కట్టాడా? లేక మా ఇళ్ళకి వచ్చి చూసాడా..మేము ఎంత విలాసంగా ఉంటున్నామో. ఆయన స్టాలిన్ కోసమో, మోడీ కోసమో అనుంటాడు అని అతడికి ఈ రకంగా కౌంటర్లు ఇచ్చాడు. దీనితో ఈ ఇద్దరు హీరోలపై పేర్ని చేసి చేసిన కామెంట్స్ ఇప్పుడు పెద్ద ఎత్తున సంచలనం రేపుతున్నాయి.