ఒకే దేశం ఒకే ఎన్నిక .. ప్రధాని ప్రకటన

ఒకే దేశం ఒకే ఎన్నిక .. ప్రధాని ప్రకటన

ప్రధాని నరేంద్ర మోడీ గురువారం నాడు ఎర్రకోటపై నుంచి 73వ భారత స్వతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా చేసిన ప్రసంగం ప్రజలందరినీ ఎంతగానో ఆకట్టుకుంది , దేశంలో ఒకేసారి ఎన్నికలు జరగటం , దేశ జనాభాను అదుపులో ఉంచడం , ప్లాస్టిక్ వినియోగం పూర్తిగా తగ్గించడం , దేశం కోసం సంపద సృష్టించేవారిని గౌరవించడం .. ప్రతి పక్ష పార్టీకి చెందిన పి . చిదంబరం వీటి పట్ల తన హర్షం వ్యక్తం చేశారు . ఇదే సమయంలో శివ సేన కూడా దేశం అంతటా ఒకేసారి ఎన్నికలు జరపాలన్న ఆలోచనను పూర్తిగా సమర్ధించింది .

ప్రధాని నరేంద్ర మోడీ దేశ అభివృద్ధి కోసం ప్రకటించిన అంశాలన్నీ బాగున్నాయని , త్వరలో ఇవి ఆచరణలో కి వస్తాయనే నమ్ముతున్నట్టు శివ సేన ప్రకటించింది . ప్రధాని నరేంద్ర మోడీ రెండవసారి పదవీ భాద్యతలు చేపట్టిన తరువాత అనేక సమస్యలను పరిస్కరిస్తున్నారు , అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతున్నారు . ఇంత కాలం దేశంలో ఎన్నికలు ఒకేసారి జరగలేదు . ఒక్కో రాష్ట్రంలో ఒక్కోసారి జరుగుతున్నాయి . దీనివల్ల అధిక వ్యయం , కాలం వృధా అవుతున్నాయి . అందుకే ప్రధాని మోడీ దేశమంతా ఒకేసారి ఎన్నికలు జరుపుతామని ఎర్ర కోట సాక్షిగా ప్రకటించారు . ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పుడు భారత సైన్య మహాదళపతి