వ్యాక్సిన్ వికటించి చిన్నారి మృతి, 90 మంది చిన్నారులకు అస్వస్థత

నాంపల్లి అర్బన్ హెల్త్ కేర్ సెంటర్ లో దారుణం జరిగింది. టికాలు వికటించి ఐదు నెలల చిన్నారి చనిపోయాడు మరో 15 మంది చిన్నారుల పరిస్థితి విషమంగా ఉంది. వారందరిని నీలోఫర్ ఆస్పత్రికి తరలించి వెంటిలేటర్ పై చికిత్సనందిస్తున్నారు.

బుధవారం ఉదయం నాంపల్లి హెల్త్ కేర్ సెంటర్ లో 90 మంది చిన్నారులకు వ్యాక్సిన్లు వేశారు. వీరంతా 3 నెలల నుంచి 5 నెలలు ఉన్న చిన్నారులే. వీరందరికి సూది ఇవ్వగానే వాంతులు, జ్వరం వచ్చినట్టు తెలుస్తోంది.

వీరికి వ్యాక్సిన్ వేసిన తర్వాత జ్వరం రాకుండా ఉండేందుకు ఇచ్చే గోళీల బదులు వేరేవి ఇచ్చినందునే ఇలా జరిగినట్టు తెలుస్తోంది. చిన్నారులను వెంటనే నీలోఫర్ తో పాటు వివిధ ఆస్పత్రులకు తరలించారు. చిన్నారుల పరిస్థితి పై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.