నిద్రపోతున్న వంగవీటి రంగా అభిమానులు నిద్ర లేచారు ?

వంగవీటి రంగా  ..ఈ పేరుకి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఓ చరిత్ర ఉంది. ఈయన ఓ బలమైన కాపు నేత. అలాగే పేదల పక్షపాతిగా ఆయనకు విజయవాడలో ఇప్పటికీ అనేక మంది అభిమానులున్నారు. కార్పొరేటర్ స్థాయి నుంచి ఎమ్మెల్యేగా ఎదిగిన నేత. కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఎదిగే సమయంలో వంగవీటి రంగా హత్య కు గురయ్యారు. వంగవీటి రంగా హత్య జరిగి మూడు దశాబ్దాలు దాటుతున్నా ఆయన పేరు లేకుండా బెజవాడ రాజకీయాలను చూడలేము అంటే అతిశయోక్తిలేదు. అనేక గ్రామాల్లో రంగా విగ్రహాలను నెలకొల్పి తమ అభిమానాన్ని చాటుకుంటారు. ఎన్నికల సమయంలో ఆయన బొమ్మ పెట్టుకుని ఊరేగే వాళ్లు అనేక మంది.

Vangaveeti Ranga (Politician) Height, Weight, Age, Wife, Biography & More »  StarsUnfolded

ఇదిలా ఉంటే .. మరోసారి వంగవీటి రంగా పేరు రాష్ట్ర వ్యాప్తంగా బాగా బలంగా వినిపిస్తుంది. వంగవీటి రంగా కుమారుడు రాధా ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నారు. ఆయన హత్య జరిగింది తెలుగుదేశం పార్టీ హయాంలోనే. ప్రతి ఎన్నికల్లోనూ వంగవీటి రంగా హత్యకు టీడీపీకి ముడిపెడుతూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం ఏపీలో కాపు సామాజికవర్గం బలంగా ఉంది. ఆ వర్గం ఎటువైపు మొగ్గు చూపితే వారికే అధికారం.

ఇప్పుడు ఎన్నికలంటూ ఏపీలో ఏమీ లేకపోయినా మరోసారి వంగవీటి రంగా హత్య చర్చనీయాంశంగా మారింది. విశాఖ రాజకీయాల్లోకి వంగవీటి రంగా వచ్చేశారు. వంగవీటి రంగా హత్య కేసులో మూడో నిందితుడు ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు అంటూ వైసీపీ ప్రధానంగా ఆరోపణలు చేస్తుంది. వెలగపూడిపై ఇటీవల భూ ఆక్రమణ ఆరోపణలు వచ్చాయి. వాటికే పరిమితం కాకుండా వంగవీటి రంగా హత్య కేసును కూడా వైసీపీకి తెరపైకి తేవడం రాజకీయంగా లబ్దికోసమేనన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. ఏదేమైనా మరోసారి వంగవీటి రంగాపేరు రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.