నరేంద్రమోడి సర్కార్ జనాలపై సరికొత్త బాదుడు మొదలుపెట్టింది. అంటే వినోదం రూపంలో కాసింత ఊరటపొందే జనాలను కూడా మోడి వదిలిపెట్టం లేదు. ట్రాయ్ రూపంలో కేబుల్, డిటిహెచ్ రంగాల్లో కొత్త టారిఫ్ ప్రకటించటం ద్వారా జనాల్లో దడపుట్టిస్తోంది. ట్రాయ్ ప్రకటన ప్రకారం ఈనెల 29వ తేదీ నుండి కొత్త టారిఫ్ అమల్లోకి వస్తోంది. కాబట్టి జనాలపై సంవత్సరం చివరి రోజుల్లో కేంద్రం బాదుడు షురూ చేసింది. ఇఫుడు ఉచితంగా చూసే ఛానళ్ళల్లో చాలా వరకూ ఇకనుండి ఉచితంగా చూడటం అన్నది దాదాపు ఉండదనే అనుకోవాలి.
వినోతం కోసం సగటు జీవులు చూస్తున్న ఛానళ్ళను ఇకపై కూడా చూడాలంటే ఇఫుడు చెల్లిస్తున్న దరలకన్నా రెట్టింపు చెల్లించాల్సి రవాటమే భారం. ప్రస్తుతం ఉచితంగా వచ్చే ఛానళ్ళకు తోడు పెయిడ్ ఛానళ్ళను కేబుల్ టివిలో రూ 150 కే చూస్తున్న వాళ్ళు ఇకనుండి కనీసం రూ 300 చెల్లించాలి. పైగా కేబుల్ టివి చూస్తున్న వాళ్ళు ఇకనుండి నెల ముందే ప్రీపెయిడ్ పద్దతిలో డబ్బులు చెల్లించాలి. ట్రాయ్ ప్రకటించిన విధానంతో దేశవ్యాప్తంగా కేబుల్ టివి ఆపరేటర్లతో పాటు సామాన్య జనాల్లో కూడా వ్యతిరేకత కనిపిస్తున్నా కేంద్రం మాత్రం లక్ష్యం చేయటం లేదు.
ట్రాయ్ నిబంధనల వల్ల పెరిగే భారం గ్రామీణ ప్రాంతాల్లోనే చాలా ఎక్కువ అవకాశం ఉంది. విచిత్రమేమిటంటే ఇప్పటి వరకూ ఉచితంగా చూసే ఛానళ్ళపైన కూడా ఇక నుండి మినిమం చార్జి రూ 130 చెల్లించాలి. మళ్ళీ దానిపై జిఎస్టీ బాదుడు అధనం. అంటే బేస్ ప్యాక్ 130 రూపాయలు ప్లస్ చూడాలనుకునే పెయిడ్ ఛానల్స్ అన్నమాట. 30వ తేదీ నుండి ఫ్రీ టు ఎయిర్ ఛానల్స్ మాత్రమే వస్తాయి. అంటే ఫ్రీ టు ఎయిర్ ఛానల్స్ అంటే ఏ ఒరియా, బెంగాలీ, భోజ్ పూరి లాంటివో అన్నమాట. వాటిని దేశంలో ఎంతమంది చూస్తారు ? కాబట్టి వాటిని వదిలిపెట్టేసి ప్రతీ ఒక్కరూ బేస్ ప్యాక్ ప్లస్ పెయిడ్ ఛానళ్ళు తీసుకోక తప్పదన్నమాట. ఎందుకంటే, జనాలకు టివి అంటే వ్యసనమైపోయింది. ఛానళ్ళ వారీగా దేనికెంత డబ్బులు చెల్లించాలో క్రింద టేబుల్ రూపంలో చూసుకోవచ్చు.

