రాజు గారి సర్వే.. తెలుగుదేశం పార్టీ నుంచి ఎంపీ సీటు ఆశిస్తున్నారా?

raghurama

2024 ఎన్నికల్లో ఏపీలో అధికారంలోకి వచ్చే పార్టీ ఏదనే ప్రశ్నకు ఎక్కువమంది వైసీపీ పేరును సమాధానంగా చెబుతున్నారు. గత మూడేళ్లలో రాష్ట్రంలో ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగకపోయినా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వల్ల వైసీపీ మరోసారి అధికారంలోకి రావడం ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటివరకు వెలువడిన సర్వేల ఫలితాలు సైతం ఇదే విషయాన్ని ప్రూవ్ చేస్తున్నాయి.

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు తాజాగా సర్వే చేయించగా ఈ సర్వేలో టీడీపీకి అనుకూలంగా వైసీపీకి వ్యతిరేకంగా ఫలితాలు వచ్చాయి. రఘురామ కృష్ణంరాజు నుంచి వైసీపీకి అనుకూలంగా ఫలితాలు వచ్చే అవకాశం ఉండదని వైసీపీ నేతలు సైతం భావిస్తారు. 2024 ఎన్నికల్లో రఘురామ కృష్ణంరాజుకు వైసీపీ తరపున టికెట్ లభించే అవకాశం దాదాపుగా లేనట్టేననే సంగతి తెలిసిందే.

రఘురామ కృష్ణంరాజు తెలుగుదేశం పార్టీ నుంచి ఎంపీ సీటు ఆశిస్తున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఈ కారణం వల్లే ఆయన తెలుగుదేశంకు అనుకూలంగా ప్రచారం చేస్తున్నారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కామెంట్ల గురించి రఘురామ కృష్ణంరాజు ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది. తెలుగుదేశం వెలిగిపోతుందని రాజుగారు చెప్పినా తెలుగుదేశం నేతలే ఆ విషయాలను నమ్మడం లేదనే సంగతి తెలిసిందే.

రఘురామ కృష్ణంరాజు వెల్లడించిన సర్వే ఫలితాలు తమకు నవ్వు తెప్పిస్తున్నాయని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు. వైసీపీ నేతలు, కార్యకర్తలు మాత్రం ఈ ఫలితాలను పెద్దగా పట్టించుకోవడం లేదు. ఈ మధ్య కాలంలో సర్వేల పేర్లతో చాలామంది తమకు అనుకూల ఫలితాలను వెల్లడిస్తున్నారని అయితే వాస్తవాలు మాత్రం భిన్నంగా ఉన్నాయని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.