ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్తె వివాహం: హాజరై వధూవరులను ఆశీర్వదించిన సీఎం చంద్రబాబు

CM Chandrababu: తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ గారి కుమార్తె వివాహ వేడుక అత్యంత వైభవంగా జరిగింది. ఈ శుభకార్యానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

గుంటూరులోని శ్రీ కన్వెన్షన్‌లో జరిగిన ఈ వివాహ వేడుకకు రాజకీయ, సామాజిక రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ కుమార్తె నాగసాయి వైదీప్తి, కెవిన్ రామ్ ల వివాహ బంధంతో ఒకటయ్యారు.

వివాహ వేదిక వద్దకు చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ మరియు కుటుంబ సభ్యులు ఘన స్వాగతం పలికారు. సీఎం వధూవరులకు పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. నూతన దంపతులు నిండు నూరేళ్లు సుఖసంతోషాలతో వర్ధిల్లాలని మనసారా ఆశీర్వదించారు.

ఈ సందర్భంగా ధూళిపాళ్ల కుటుంబ సభ్యులతో సీఎం కాసేపు ముచ్చటించి, వారికి తన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ వివాహ వేడుకలో ముఖ్యమంత్రితో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, టీడీపీ ముఖ్య నాయకులు మరియు భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొని సందడి చేశారు.

Pepakayala Ramakrishna Shocking Comments On YCP and Kutami | YS Jagan | CM Chandrababu Naidu | TR