త‌మ బ‌ట్టలు ప‌వ‌న్‌ విప్పన‌వ‌స‌రం లేదు… తామే విప్పి చూపిస్తాం!

వారాహి యాత్రలో భాగంగా పవన్ కల్యాణ్ చేస్తున్న ప్రసంగాల్లోని వ్యాఖ్యలపై వైసీపీ నేతలు ఫైరవుతున్న సంగతి తెలిసిందే. మరిముఖ్యంగా కాకినాడలోని సర్పవర జంక్షన్ వద్ద జరిగిన సభలో పవన్ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేతలతోపాటు.. స్థానిక కాపు నేతలు సైతం పవన్ పై విరుచుకుపడుతున్నారు. చంద్రబాబు బానిసకు ఇంతకంటే మాట్లాడటం ఏమి వస్తుంది అంటూ తీవ్రస్థాయిలో దుయ్యబడుతున్నారు. ఇందులో భాగంగా తాజాగా మైకులముందుకు వచ్చారు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి.

అవును… జ‌న‌సేనాని ప‌వ‌న్‌ క‌ల్యాణ్‌ పై నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే న‌ల్లపురెడ్డి ప్రస‌న్న‌ కుమార్‌ రెడ్డి విరుచుకుప‌డ్డారు. ప‌దేప‌దే వైసీపీ నేత‌ల బ‌ట్టలూడ‌దీసి కొడతానంటూ చేస్తున హెచ్చరికలపై ఆయ‌న తీవ్రంగా స్పందించారు. ఈ సందర్బగా… గ‌తంలో ప్రజారాజ్యం సమయంలో వైఎస్సార్ ని ఉద్దేశించి కూడా ఇదే ర‌కంగా బ‌ట్ట‌లూడ‌దీసి కొడతామని హెచ్చరించార‌ని గుర్తు చేశారు.

ఈ సందర్భంగా… ప్రజ‌లు ఎవ‌రి బ‌ట్టలూడ‌దీసి కొట్టి త‌రిమేశారో రాష్ట్ర ప్రజలంద‌రికీ తెలుస‌న్న ప్రసన్నకుమార్ రెడ్డి… పార్టీ పెట్టి, రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయినప్పుడైనా… ప్రజలు రెండు చోట్లా బట్టలు ఊడదీసి పంపారనే విషయం బుర్రకు తట్టి ఉండాలని తెలిపారు! నువ్వేంది వైసీపీ నేత‌ల్ని, ముఖ్యమంత్రిని బ‌ట్టలూడ‌దీసి కొట్టేద‌ని ప‌వ‌న్‌ ను ఉద్దేశించి ఆయ‌న ప్రశ్నించారు.

అనంతరం “బ‌ట్టలూడ‌దీసి చూడాల‌నే కోరిక వుంటే చెప్పు పవన్… తామే వ‌స్తాం” అని నల్లపురెడ్డి తెలిపారు. త‌మ బ‌ట్టలు ప‌వ‌న్‌ విప్పనవ‌స‌రం లేకుండా.. తామే విప్పి చూపిస్తామ‌ని సెటైర్లు వేశారు. తమకు కూడా మాట్లాడటం వచ్చని… కాకపోతే సంస్కారం అడ్డొస్తుందని.. పద్దతి మార్చుకోని పక్షంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు.

ఈ సందర్భంగా చిరంజీవి ప్రస్థావన తీసుకొచ్చిన నల్లపురెడ్డి… ఆయన పెద్దమనిషని, చిరంజీవి మనసున్న మహరాజని, పవన్ వల్ల చిరంజీవి పరువు, ఆయన తండ్రి పరువు పోతుందని తెలిపారు.