మల్లాపూర్ లో మోత్కుపల్లి మెరుపు ధర్నా (వీడియో)

ఆలేరు ఇండిపెండెంట్ అభ్యర్ధి, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహ్ములు ప్రచార యాత్రను కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఎన్నికల ప్రచార నిమిత్తం ఆలేరు నియోజకవర్గం యాదగిరిగుట్ట మండలం మల్లాపురంలో నర్సింహ్ములు ప్రచారం చేస్తుండగా కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఆయన ప్రచారాన్ని అడ్డుకొని నిరసన తెలిపారు.

దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకోవడంతో ఆగ్రహించిన నర్సింహ్ములు రోడ్డు పైనే ధర్నా చేశారు. కాంగ్రెస్ సభ్యులకు, మోత్కుపల్లి అనుచరులకు తీవ్ర వాగ్వాదం జరిగింది. ఇండిపెండెట్ గా పోటి చేస్తున్న మోత్కుపల్లికి బిఎల్ ఎప్ మద్దతు ప్రకటించి ఇటీవల ప్రకటించిన వారి రెండో జాబితాలో మోత్కుపల్లి పేరు కూడా పెట్టింది. దీంతో మోత్కుపల్లి పూర్తి స్థాయి ప్రచారాన్ని చేపట్టాడు. ఈ క్రమంలోనే ఈ సంఘటన జరిగింది. మోత్కుపల్లి ధర్నా చేసిన వీడియో కింద ఉంది చూడండి.