క్రూషియల్ మ్యాటర్ లో జగన్ వెనక కొండంత అండగా నిలబడ్డ మోడీ ..!!

ys jagan rethinking about dissolving of legislative council
మూడు రాజ‌ధానుల విష‌యంలో కేంద్రం వైఖ‌రి ఏంట‌న్న‌ది ఇటీవ‌ల దాఖ‌లు చేసిన అఫిడ‌విట్ తో ఓ క్లారిటీ దొరికిన సంగ‌తి తెలిసిందే. ఈ అఫిడ‌విట్ తో  జ‌గ‌న్  మోహ‌న్ రెడ్డికి ప‌రోక్షంగా కేంద్రం మ‌ద్ద‌తిచ్చిన‌ట్లుగానే భావించాల్సి వ‌చ్చింది. ఇక ఏపీ బీజేపీ నేత‌లు రాజ‌ధానుల విష‌యంలో క‌ర్ర విర‌గ‌కూడ‌ద‌ను..పాము చావ‌కూడ‌ద‌న్న వైఖ‌రితో ముందుకెళ్తున్నారు.  కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి- ఏపీ బీజేపీ నేత‌లకి మ‌ధ్య ఎక్క‌డో  అండ‌ర్ స్టాండింగ్ మిస్ అవుతుంద‌నే అనుమానం వ్య‌క్త‌మైంది. జ‌గ‌న్ ఏం చేస్తున్నా..కేంద్రం చూస్తు ఊరుకోదంటూ ఏపీ బీజేపీ నేత‌ల మాట‌ల‌కి-కేంద్ర వైఖ‌రికి ఎక్క‌డో లింక్ తప్పిన‌ట్లుగా అనిపించేది.
jagan-modi
jagan-modi

తాజాగా బీజేపీ నేత‌ల వైఖ‌రిలో మార్పు క‌నిపిస్తోంది. కేంద్రంలో ప్ర‌భుత్వం వేరు..పార్టీ వేరు అనే ప‌రిస్థితి వ‌చ్చింది. జ‌గ‌న్ స‌ర్కార్ ఎలాంటి నిర్ణ‌యాలు  తీసుకున్నా పార్టీకి ముడిపెట్టి విమర్శించేవారు. ఈ నేప‌థ్యంలో ఎల్లో మీడియా బీజేపీకి అవ‌స‌రం మేర స‌హ‌క‌రించేది. అయితే ఇప్పుడ‌దే పార్టీ స్వ‌రం మార్చింది.  రాజ‌ధాని మ్యాటర్లో కేంద్రం అఫిడ‌విట్ దాఖ‌లు చేసిన‌ప్ప‌టికీ..దానికి బీజేపీ కి సంబంధం లేద‌ని కొత్త వ్యూహాన్ని తెర‌పైకి తీసుకొచ్చింది. కేంద్రంలో ప్ర‌భుత్వం వేరు..పార్టీ వేరు రెండింటికి సంబంధం లేద‌న్న‌ట్లు కొత్త వాద‌న తెర‌పైకి తీసుకొస్తున్నారు. అయితే ఈ లాజిక్ ఏపీ విష‌యంలో మాత్రం వ‌ర్తించ‌దేమో.

ఇక్క‌డ పార్టీనీ..ప్ర‌భుత్వాన్ని మాత్రం వేరుచేయ‌లేదు. ఏపీ బీజేపీ నేత‌ల‌కు మాత్రం  ఈ రెండు  ఇక్క‌డ  ఒక్క‌టే. ఏపీ బీజేపీ మాట‌లు..తీరు ఎలా ఉన్నా?  కేంద్రం నుంచి ప్ర‌ధాని మోదీ నుంచి మాత్రం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి రాజ‌ధానుల విష‌యంలో కావాల్సిన మ‌ద్ద‌తైతే ద‌క్కుతున్న‌ట్లే ఉంది.  అమ‌రావ‌తిలో  మోదీ వేసిన రాజ‌ధాని  పునాది  రాయి ఇప్పుడు మూడు ముక్క‌లు అవుతుంది. ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇచ్చినా..ఇవ్వ‌క‌పోయినా జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి ఈ విష‌యంలో వెనుక‌నుంచి స‌పోర్ట్ చేస్తే చాలు అనుకున్నారు ఏమో!