టీడీపీకి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన ఎమ్మెల్యే రోజా

టీడీపీకి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారు నగరి వైసీపీ ఎమ్మెల్యే రోజా. కొద్ది రోజుల క్రితం టీడీపీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ పరుష పదజాలంతో రోజాను దారుణంగా దూషించాడు. కాల్ మనీ, సెక్స్ రాకెట్ అంటూ ప్రతిసారి రోజా నన్ను బాధ పెట్టేలా మాట్లాడుతుంది అని అన్న బోడె ప్రసాద్ రోజాపై అసభ్యకర వ్యాఖ్యలు చేశాడు.

ఆమె వ్యభిచారి అంటే నమ్ముతారు, లేదా బ్రోతల్ కంపెనీ నడుపుతుంది అంటే నమ్ముతారు అంటూ తీవ్ర అనుచిత వ్యాఖ్యలు చేశాడు బోడె. బ్రోతల్ కంపెనీ నడుపుతూ నన్నేమైనా పిలిచిందా అంటూ అసభ్యంగా మాట్లాడాడు. తన నియోజకవర్గానికి వస్తే ఆమెకు చెప్పులతోస్వాగతం పలుకుతాను అంటూ రోజాను అవమానించేలా వ్యాఖ్యలు చేశాడు. బహిరంగంగా మీడియా ముందు రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఆవిడ తీవ్ర మనస్థాపానికి గురయ్యారు.

బోడె ప్రసాద్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ పోలీసులు పట్టించుకోకపోవటంతో ఆగ్రహించిన రోజా కోర్టును ఆశ్రయించారు. ఈ విషయాన్నీ సీరియస్ గా తీసుకున్న హైకోర్టు పాజిటివ్ గా స్పందించింది. పోలీసుల తీరుపై సీరియస్ అయ్యింది. వెంటనే కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జరీ చేసింది. నిందితులపై తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా సూచించింది. దీంతో టీడీపీ నేత బోడె ప్రసాద్ కు బిగ్ షాక్ తగిలింది.