సీఎం రమేష్ ఇంటిపై ఐటి దాడులు అందుకే: లోకేష్ సంచలన ట్వీట్

 

టిడిపి నేతల ఆస్తులపై వరుసగా ఐటి దాడులు మొదలయ్యాయి. తెలంగాణాలో రేవంత్ రెడ్డి ఇళ్లపై ైట్ దాడులు జరిగిన నేపథ్యంలో తర్వాత టార్గెట్ ఏపీ టిడిపి నేతలపైనే అనుకున్నారంతా… ఊహించినట్టుగానే వరుసగా ఆంధ్రాలో టిడిపి నేతల ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు ఐటి అధికారులు. కాగా ఈ ఐటి దాడులపై స్పందించారు ఏపీ ఐటి శాఖ మంత్రి, సీఎం తనయుడు నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా సంచలన ట్వీట్ పెట్టారు. ఆయన బీజేపీ పై నిప్పులు చెరిగారు. ఆ వివరాలు కింద ఉన్నాయి చదవండి.

హోదా తో పాటు ఇచ్చిన 18 హామీలు నెరవేర్చాలి అని నిలదీసినందుకు మోడీ ఆంధ్రప్రదేశ్ పై కక్ష కట్టారు.మొన్న బీద మస్తాన్ రావు,నిన్న సుజనా చౌదరి,ఈ రోజు సిఎం రమేష్. కడప ఉక్కు…ఆంధ్రుల హక్కు అని అన్నందుకు ఎంపీ సిఎం రమేష్ పై ఐటీ దాడులు.దీక్ష చేసి ఈ రోజుకి వంద రోజులు పూర్తయ్యింది అయినా కేంద్రంలో చలనం లేదు.

ఆంధ్రప్రదేశ్ కి పెట్టుబడులు రాకుండా చెయ్యాలి అని మోడీ రాష్ట్రంలోని పారిశ్రామికవేత్తలు, పరిశ్రమల పై ఐటీ దాడులు చేయిస్తున్నారు…ఎన్ని ఇబ్బందులు పెట్టినా హోదా సాధనలో వెన్నక్కి తగ్గేది లేదు…కేంద్రం మెడలు వంచుతాం… హోదా సాధిస్తాం…ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు. అంటూ ట్వీట్ చేశారు. ట్వీట్ ఫోటోలు కింద ఉన్నాయి చూడండి.