ఏపీ కేబినేట్ కీలక నిర్ణయాలివే

బుధవారం ఉదయం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినేట్ సమావేశమైంది. ఈ కేబినేట్ భేటిలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన విధి విధానాల పై చర్చించారు. ప్రతి రైతు కుటుంబానికి రూ. 10 వేలు ఇవ్వాలని నిర్ణయించారు. ఫిబ్రవరి చివరి వారంలో అర్హూలైన అందరికి చెక్కులు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఖరీఫ్ కాలం నుంచి కౌలు రైతులను కూడా ఆదుకునే విధంగా విధివిధానాలను రూపొందించాలని నిర్ణయం తీసుకున్నారు. 

ఏపీ కేబినేట్ తీసుకున్న నిర్ణయాలివే 

  • రైతు రుణమాఫీ చెక్కులు త్వరితగతిన చెల్లించాలి. 
  • ఎన్జీవోలు, సచివాలయ ఉద్యోగులకు ఒక్కొక్కరికి 175 చదరపు గజాల ఇంటి స్థలం.
  • చదరపు గజం రూ. 4వేల చొప్పున 230 ఎకరాలు కేటాయింపు.
  • జర్నలిస్టులకు ఎకరం రూ. 10 లక్షల చొప్పున 30 ఎకరాలు కేటాయింపు.
  • తొలి విడత సీఆర్డీఏకు రూ. కోటి చెల్లిస్తే సొసైటీకి భూమి బదలాయింపు. మిగిలిన మొత్తాన్ని రెండేళ్లలో చెల్లించే వెసులుబాటు.
  • డ్వాక్రా మహిళలకు స్మార్ట్ ఫోన్లు. సిమ్ కార్డుతో పాటు మూడేళ్లపాటు కనెక్టివిటీ ఇచ్చేలా పంపిణీ.