జైపాల్ రెడ్డి భౌతిక కాయాన్ని సందర్శించిన కేసీఆర్

జైపాల్ రెడ్డి భౌతిక కాయాన్ని సందర్శించిన కేసీఆర్

మాజీ కేంద్ర మంత్రి , సీనియర్ నాయకుడు జైపాల్ రెడ్డి నివాసానికి వెళ్లి తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు నివాళులు అర్పించారు . అనారోగ్యతో ఆదివారం రోజు తెల్లవారు జామున మృతి చెందిన జైపాల్ రెడ్డి మృతి వార్త తెలుసుకున్న చంద్ర శేఖర్ రావు జూబిలీ హిల్స్ లోని జైపాల్ రెడ్డి నివాసానికి వెళ్లి భౌతిక కాయానికి శ్రద్ధాంజలి ఘటించారు .

తెలంగాణ రాష్ట్రము సాకారం కావడంలో ఢిల్లీలో ఉండి కాంగ్రెస్ అధినేత్రి సోనియాను ఒప్పించడంలో జైపాల్ రెడ్డి నిర్వహించిన పాత్ర అపూర్వమైనది . అందుకే చంద్ర శేఖర్ రావు రాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలతో జైపాల్ అంత్యక్రియలు జరపాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలిచ్చారు . సోమవారం మధ్యాన్నం సంజీవయ్య పార్క్ సమీపంలో జైపాల్ రెడ్డి అంత్యక్రియలకు ప్రభుత్వం స్థలం కేటాయించింది .

జైపాల్ మృతికి కాంగ్రెస్ పార్టీ నాయకురాలు సోనియా గాంధీ , రాహుల్ గాంధీ , ప్రియాంక గాంధీ , రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీ నాయకు జైపాల్ రెడ్డి నివాసానికి వెళ్లి నివాళులు అర్పించారు .