తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి నుండి రంపచోడవరం వరకు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పల్లె వెలుగు బస్సులో ప్రయాణించారు. ఎమ్మెల్యేలకు, ఎంపిలకు, ఎంఎల్ సిలకు బస్సులలో సీట్టు రిజర్వు చేసి ఉన్న గత ముప్పైయేళ్లలో ఎవ్వరూ ఆర్టీసి బస్సు ప్రయాణం చేసి ఉండారు. ఇపుడు పల్లె వెలుగు బస్సులో ప్రయాణం చేసి పవన్ కల్యాణ్ రికార్డు సృష్టించారు. ప్రజలు ఎన్నుకున్నోళ్లు ప్రజల ప్రధాన ప్రయాణ వాహనమయిన బస్సులో వెళ్లాలనుకోనక పోవడం ఆశ్చర్యం. అంటే ఆశేష ప్రజానీకం మధ్య కూర్చోవడం మన ‘ప్రజానాయకు’లకు ఇష్టం లేదు. భారీ వాహానాలు గన్ మెన్ పెద్ద కాన్వాయ్ అన్నింటికి మించి ప్రజలందరిని బెదరెగొట్టేంత హైస్పీడ్ లో ప్రయాణించినపుడే వారికి గుర్తింపు అనే బాపతు వారు. వీళ్ల వోవర్ యాక్షన్ వల్ల ఎన్ని ప్రమాదాలో జరిగాయో లెక్కలేదు. నెలలోఒక్కపూటయినాఆర్డినరీ ఆర్టీసు బస్సులో ప్రయాణిస్తే సాధారణ ప్రజలు ఎలా బతుతుకున్నారో తెలుసుకునేందుకువవీలయ్యేది. వాళ్లెవరికీ ప్రజల బాధలతో పనిలేదు. వాళ్లు, వాళ్ల పబ్లిసిటీ, వ్యాపారాలు, రాజకీయాలు తప్ప, వాళ్ల అజండా ప్రజలు లేదు.ఒక బస్సు ఉదాహరణతోె ప్రజాప్రతినిధులు ప్రజలకు దూరంగా బతకాలుకుంటారని, ఒక్క ఎన్నికలపుడే రకరకాల వేషాలు వేస్తారని అనుకోవాలి.
నాయకుల దురలవాటు మీద పవన్ కల్యాణ్ చావు దెబ్బ వేశాడు.
పల్లె వెలుగు బస్సు లో ప్రయాణించి స్వయంగా గిరిజనులు సమస్యలు తెలుసుకున్నారు. రాజమండ్రి నుండి గడాల ,కోరుకోండ,గోకవరం మీదగా రంపచోడవరం ప్రయాణం సాగింది.

రైతు లు అందించిన ధాన్యాన్ని పట్టుకొని పరిశీలించారు. వారికి గిట్టుబాటు ధర అందచేయటంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
పవన్ కళ్యాణ్ వెంట సి పి ఐ రామకృష్ణ, జనసేన పార్టీ సీనియర్ నాయకులు నాదెండ్ల మనోహర్, మాజీ మంత్రి బాల రాజు ,పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
గిరిజనులను ఓటు బ్యాంకు గా చూస్తూ రాజకీయ పార్టీలు వారికి అన్యాయం చేస్తున్నాయి, జనసేన ద్వారా మీరు మా సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా ప్రయత్నం జరుగుతుందని పవన్ హామీ ఇచ్చారు.
పవన్ అపుడపుడు ఇలా బస్సుల్లో ప్రయాణించి రాజకీయాలను, ప్రజా ప్రతినిధులను సాధారణ ప్రజల మధ్య కు తీసుకువస్తారని ఆశిద్దాం.
