జగన్ అభిమానులు ఈ వీడియో మిస్ అవకండి.

వైసీపీ అధినేత జగన్ ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా చేస్తున్న పాదయాత్ర సోమవారం 3000 మైలు రాయిని దాటింది. విజయనగరం జిల్లా దేశపాత్రుని పాలెంలో జగన్ మూడువేల కిలోమీటర్ల పాదయాత్ర మైలురాయిని దాటారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

జగన్ ఈ రోజు 3000 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేసుకున్న సందర్భంగా పార్టీ శ్రేణులు, ప్రజలు పెద్ద ఎత్తున పాదయాత్రలో పాల్గొన్నారు. ౩౦౦౦ కిలోమీటర్లు పూర్తి చేసుకున్న దేశపాత్రుని పాలెంలో జగన్ పైలాన్ ను ఆవిష్కరించి శాంతికపోతాన్ని ఎగురవేశారు. పైలాన్ వద్ద రవి మొక్కను నాటారు. దానికి సంబంధించిన వీడియో కింద ఉంది చూడండి.

విజయనగరం జిల్లా ఎస్.కోట నియోజకవర్గం చింతలపాలెంలో జగన్ అడుగు పెట్టగానే ప్రజలు పూలవర్షం కురిపించారు. పార్టీ నేతలు బొత్స, భూమన, కోలగట్ల, పి.రాజన్న దొర, పుష్ప శ్రీవాణి, మజ్జి శ్రీనివాసరావు, కడుబండి శ్రీనివాసరావు తదితరులు జగన్ కు స్వాగతం పలికారు. చింతలపాలెంలో జగన్ తో పాటు అధిక సంఖ్యలో జనం పాదయాత్రలో పాల్గొన్నారు. ఆ వీడియో కింద ఉంది చూడవచ్చు.

jagan praja sankalpa yatra in chinthalapalem