ఫస్టు నైట్ రోజే భార్యకు భర్త ఆ.. వేధింపులు, బెడ్రూంలో వీడియో తీసి

పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకొని ఎన్నో కలలతో అత్తాగారింట్లోకి ఆ నవ వధువు అడుగుపెట్టింది. కానీ భర్తలో దాగి ఉన్న శాడిజాన్ని ఆమె గుర్తించలేకపోయింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

కర్ణాటకలోని బసనగుడి పట్టణానికి చెందిన యువతికి అదే ప్రాంతానికి చెందిన రాజగోపాల్ తో వివాహం జరిగింది. ఫస్టు నైట్ రోజే రాజగోపాల్ తన భార్యను అనుమానించాడు. ఆమె ఫోన్ ను మొత్తం ఎంక్వైరీ చేశాడు. అందులో ఉన్న మగాళ్ల నంబర్ల గురించి అడిగి తెలుసుకున్నాకనే ఆమెతో కలిశాడట. ఆ రోజే నీకు ఎవరెవరు పరిచయం, ఏమైనా సంబంధాలు ఉన్నాయా అని అడిగాడట. అంతే కాకుండా ఎక్స్ పీరియన్స్ ఉన్నామెలా ప్రవర్తిస్తున్నావని కూడా వేధించాడట. అయినా ఈ విషయాలన్ని చెబితే పరువు పోతుందని ఆమె భరించింది. 

రోజులు గడుస్తున్న కొద్ది వేధింపులు ఎక్కువ చేశాడు. భార్యను ఉద్యోగానికి పంపి వచ్చిన డబ్బులు తీసుకోవాలని ప్లాన్ వేశాడు. అసభ్యంగా మాట్లాడి, బెడ్రూంలో ఏకాంతంగా కలిసిన వీడియోలు చేసి బ్లాక్ మెయిల్ చేశాడు. అదనపు కట్నం తేవాలని, జాబ్ చేయాలని ఒత్తిడి తెచ్చాడు. లేకపోతే సోషల్ మీడియాలో వీడియోలు పెడుతానని బెదిరించాడు.

తన భర్తకు డబ్బు వ్యామోహం, శాడిజం ఉండడంతో తట్టుకోలేక ఆ యువతి పుట్టింటికి వెళ్లింది. జరిగిందంతా తల్లిదండ్రులకు చెప్పి పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.