ఏపీ ఉద్యోగులకు గుడ్ న్యూస్

ఏపీ ఉద్యోగులకు శుభవార్త చెబుతూ కేబినేట్ బేటిలో నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగులకు 20 శాతం మధ్యంతర భృతి ఇవ్వాలని నిర్ణయించారు. 2018 జూలై 1 నుంచే ఇది వర్తిస్తుంది. పెంచిన ఐఆర్ ని వచ్చే జూన్ నుంచి ఉద్యోగులకు అమలు చేస్తారు.

ఆర్టీసి ఉద్యోగులకు ఇచ్చిన ఐఆర్ తో సమానంగానైనా తమకు కూడా ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు సీఎం చంద్రబాబును కోరాయి. దీంతో కేబినేట్ భేటిలో వారికి సానుకూల నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి.