బిటెక్ అమ్మాయి పై గ్యాంగ్ రేప్

బీటెక్ చదువుతున్న అమ్మాయి పై దారుణం జరిగింది. ఉన్నత చదువుల కోసం కోచింగ్ వెళ్లి వస్తున్న అమ్మాయి ని కిడ్నాప్ చేసిన కామాందులు అమ్మాయి పై అత్యాచారానికి పాల్పడ్డారు. ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తెచ్చినా దుర్మార్గుల్లో మార్పు రావడం లేదని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు వివరాలు ఏంటంటే…

ఆగ్రాలో బిటెక్ చదువుతున్న బాధితురాలు తల్లిదండ్రులతో కలిసి ఉంటుంది. కాలేజికి వెళ్లి వచ్చిన తర్వాత ఉన్నత విద్య కోసం సాయంత్రం కోచింగ్ వెళుతుంటుంది. మంగళవారం సాయంత్రం కోచింగ్ సెంటర్ నుంచి తిరిగి స్కూటి పై ఇంటికి వస్తుంది. ఆమె ఇంటికి వస్తుండగా కొండ ప్రాంతంలో ఇద్దరు యువకులు బైక్ పై ఆమె స్కూటిని ఫాలో అయ్యి ఆమెకు అడ్డుతగిలారు.

ఆమెను ఇద్దరు యువకులు పట్టుకొని అమ్మాయి స్కూటిని ఎవరికి కనిపించకుండా చెట్లల్లోకి పడేశారు. ఆమెను తమ బైక్ పై యమునా నదీ తీరంలోని కొండ ప్రాంతానికి లాక్కెళ్లారు. అక్కడ అప్పటికే మరో ఇద్దరు యువకులు ఉన్నారు. మొత్తం నలుగురు యువకులు కలిసి ఆ అమ్మాయి పై గ్యాంగ్ రేప్ కు  పాల్పడ్డారు. అనంతరం యువతి తలపై బలంగా కట్టెతో బలంగా దాడి చేసి అక్కడి నుంచి వారు పారిపోయారు.

మరోవైపు రాత్రైనా తమ కుమార్తె ఇంటికి రాకపోవడంతో యువతి కుటుంబ సభ్యులు కంగారుతో అంతటా వెతికిన ప్రయోజనం లేదు. దీంతో వారు పోలీసులను ఆశ్రయించారు. అంతలోనే బాధిత అమ్మాయి ఎలాగో అలా తేరుకొని ఇంటికి చేరుకుంది. దీంతో బాధితురాలి వాంగ్మూలాన్ని రికార్డు చేసిన పోలీసులు నలుగురు నిందితులపై కేసు నమోదుచేశారు.

అనంతరం యువతిని వైద్య పరీక్షల కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాగా, ప్రస్తుతం నలుగురు నిందితులు పరారీలో ఉన్నారనీ, వారిని పట్టుకునేందుకు ప్రత్యేక టీమ్స్ ను రంగంలోకి దించామని ఆగ్రా ఎస్పీ ప్రశాంత్ వర్మ తెలిపారు. ఇది తెలిసిన వారి పనేనని పోలీసులు అనుమానిస్తున్నారు. బిటెక్ అమ్మాయి పై గ్యాంగ్ రేప్ జరగడం స్థానికంగా కలకలం సృష్టించింది.