గల్లా వ్యాఖ్యలతో సభలో దుమారం

గల్లా జయదేవ్ వాడిన భాష సరైనది కాదంటూ బిజెపి నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. గల్లా జయదేవ్ దేశ ప్రధానిని మోసగాడు, అబద్దాల మనిషి అనడం సరైన పద్దతి  కాదంటూ  కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ ఆందోళన చేశారు. దీనికి బిజెపి ఎంపీలు మద్దతు ఇవ్వటంతో సభలో కాసేపు ఆందోళన ఏర్పడింది. వాటిని రికార్డుల్లో నుంచి తొలగించి జయదేవ్ తో క్షమాపణ చెప్పించాలని వారు డిమాండ్ చేశారు. దీంతో స్పీకర్ కలుగజేసుకొని అన్ని రికార్డుల్లో ఉన్నాయని అభ్యంతర వ్యాఖ్యలు ఉంటే పరిశీలించి చర్య తీసుకుంటానని స్పీకర్ సభ్యులకు చెప్పటంతో వారు శాంతించారు.