Jagan House Incident: తాడేపల్లి ప్యాలస్ వద్ద మంటలు.. అనుమానాలకు తావిస్తున్న ఘటన!

Jagan House Incident: తాడేపల్లిలోని వైసీపీ అధినేత జగన్ నివాసం వద్ద గురువారం ఉదయం అగ్ని ప్రమాదం చోటుచేసుకోవడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ప్యాలస్ వద్ద గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భద్రతా సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించడంతో, మంటలు త్వరగా అదుపులోకి తీసుకువచ్చారు. అయితే, ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడం ఇంకా మరిన్ని అనుమానాలను రేకెత్తిస్తోంది.

ఇంతకుముందు మద్యం కుంభకోణంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేయడం, ఆ తరువాతే ఈ ఘటన జరగడం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారి తీసింది. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం, విజ‌యవాడ పోలీస్ క‌మిష‌న‌ర్ రాజశేఖర్‌బాబు నేతృత్వంలో సిట్‌కు విస్తృత అధికారాలు అప్పగించబడ్డాయి. ఈ విచారణలో ఎంతటి వారైనా తప్పించుకోలేరని, అవసరమైతే అరెస్టులు కూడా జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఈ క్రమంలోనే తాడేపల్లి ప్యాలస్ వద్ద మంటలు చెలరేగడం అనేక అనుమానాలకు తావిస్తోంది. మంటల్లో పలు కీలక డాక్యుమెంట్లు, డైరీలు తగలబడ్డాయనే వార్తలు బయటకు రావడం టీడీపీ నాయకులను ఆగ్రహానికి గురిచేసింది. “సిట్ విచారణ ముందుకొచ్చే క్రమంలోనే పాత రికార్డులను కాపాడుకునేందుకు ఇలా చేసారా?” అంటూ టీడీపీ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. ముఖ్యంగా, ప్యాలస్ బయట కాలిపోయిన కాగితాలు, సీసీటీవీ ఫుటేజ్ ఇప్పటి వరకు బయటకు రాకపోవడం మరింత అనుమానాస్పదంగా మారింది.

ఈ ఘటనపై అధికార వైసీపీ నుంచి స్పష్టమైన వివరణ రాకపోవడంతో, ప్రతిపక్ష టీడీపీ మరింత దూకుడుగా విమర్శలు చేస్తోంది. “సిట్ విచారణను తప్పించుకోవడానికి ఇదంతా చేయించారా?” అంటూ తీవ్ర ఆరోపణలు గుప్పిస్తోంది. ఏదేమైనా, ఈ ఘటనపై దర్యాప్తు ఎంతగా ముందుకెళ్లుతుందో, ఏ కొత్త విషయాలు బయటకు వస్తాయో వేచి చూడాల్సిందే.

మోడీ పై నోరు జారిన జగన్ | YS Jagan Shocking Comments On PM Modi | Telugu Rajyam