మాజీ మంత్రి, నిజాయితీకి మారుపేరు అయిన వడ్డే శోభనాద్రీశ్వరరావు 75 వసంతాలుపూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మిత్రులు, శ్రేయోభిలాషులు వడ్డే సుదీర్ఘ రాజకీయ జీవితంలో ని సన్నివేశాల్ని, ఆయన అనుభవాలను క్రోడీకరించి చెరగని జ్ఞాపకాలు తరగని తృప్తి గా ఒక పుస్తకంగా ఆవిష్కరించారు. వడ్డే ఆత్మీయ మేలు కలయిక ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు హాజరయ్యారు. సోషలిస్టు భావాలతో స్ఫూర్తి పొందిన వడ్డే ఆచార్య రంగా అనుచరులలో ఒకరు. తెలుగు దేశం పార్టీలో చాలా కాలం కొనసాగినా, ఇటీవల చంద్రబాబు నాయుడు విధానాలతో ఆయన విబేధిస్తున్నారు. అందుకే ఆ పార్టీ నుంచి వైదొలిగారు. రాజధాని అమరావతి నిర్మాణానికి రైతుల పచ్చని పొలాలను తీసుకోవడాన్ని ఆయన వ్యతిరేకించారు. అదే విధంగా బందర్ పోర్ట్ నిర్మాణం వంటి ఇతర ప్రాజక్టులకు రైతుల భూములను తీసుకుని వ్యవసాయాన్ని నాశనం చేస్తున్నారని ఆయన చంద్రబ ాబు విధానాలమీద చాలా కాలం ఉద్యమిస్తున్నారు. 75 సంవత్సరాలు పైబడినా, ఆయన లో రైతు పక్షపాతం, పోరాట స్ఫూర్తి తరగలేదు. అసలు సిసలైన రైతు నాయకుడాయన.
రైతు నేస్తం వడ్డే వసంతోత్సవం (వీడియో)
